'జయం' సినిమాలో నితిన్ సరసన నటించిన ముద్దుగుమ్మ సదా గుర్తుంది కదా. 'వెళ్లు.. వెళ్లు.. వెళ్లవయ్యా..' అనే డైలాగ్తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత విక్రమ్తో 'అపరిచితుడు', జూనియర్ ఎన్టీఆర్తో 'నాగ' తదితర సినిమాల్లోనూ నటించింది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ తదితర యంగ్ హీరోల సినిమాల్లోనూ నటించింది కానీ, స్టార్డమ్ దక్కించుకోలేకపోయింది. ఇప్పుడయితే, ఎక్కడా సదా పేరు వినిపించడం లేదు.
సడెన్గా ఓ సినిమాతో సదా పేరు తెర పైకి వచ్చింది. ఇదో సీ గ్రేడ్ మూవీలా అనిపిస్తోంది. తమిళంలో 'టార్చ్లైట్' పేరుతో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో 'శ్రీమతీ 21 ఎఫ్' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో వేశ్య పాత్రలో నటిస్తోంది సదా. నిజానికి ఈ సినిమా ముచ్చట ఈనాటిది కాదు. ఏనాటిదో. ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది. గతంలో ఛార్మి, శ్రియ, అనుష్క తదితర హీరోయిన్లు వేశ్య పాత్రల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు సదా కూడా అదే ప్రయత్నం చేస్తోంది.
యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. సినిమా ప్రచార చిత్రం చూస్తే, అడల్డ్ డైలాగ్స్తో పాటు, ఓ సోషల్ కాజ్తో కూడిన మెసేజ్ కూడా దాగి ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, ఫేడ్ అవుట్ అయిపోయిన సదా ఈ తరహా సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతుందా.? ఫుల్ డోస్ గ్లామరస్ హీరోయిన్లు కమర్షియల్ సినిమాల్లో చేస్తున్న ఎక్స్పోజింగే కొన్ని సార్లు బెడిసికొట్టేస్తోంది. అలాంటిది పాత కాలం నాటి నిర్మాణ విలువలతో సదా 'శ్రీమతీ 21 ఎఫ్' అంటూ ఏం సాధిస్తుందో చూడాలిక.