వేశ్య పాత్రలో నితిన్‌ హీరోయిన్‌.!

మరిన్ని వార్తలు

'జయం' సినిమాలో నితిన్‌ సరసన నటించిన ముద్దుగుమ్మ సదా గుర్తుంది కదా. 'వెళ్లు.. వెళ్లు.. వెళ్లవయ్యా..' అనే డైలాగ్‌తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత విక్రమ్‌తో 'అపరిచితుడు', జూనియర్‌ ఎన్టీఆర్‌తో 'నాగ' తదితర సినిమాల్లోనూ నటించింది. ఆ తర్వాత ఉదయ్‌ కిరణ్‌ తదితర యంగ్‌ హీరోల సినిమాల్లోనూ నటించింది కానీ, స్టార్‌డమ్‌ దక్కించుకోలేకపోయింది. ఇప్పుడయితే, ఎక్కడా సదా పేరు వినిపించడం లేదు.

 

సడెన్‌గా ఓ సినిమాతో సదా పేరు తెర పైకి వచ్చింది. ఇదో సీ గ్రేడ్‌ మూవీలా అనిపిస్తోంది. తమిళంలో 'టార్చ్‌లైట్‌' పేరుతో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో 'శ్రీమతీ 21 ఎఫ్‌' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో వేశ్య పాత్రలో నటిస్తోంది సదా. నిజానికి ఈ సినిమా ముచ్చట ఈనాటిది కాదు. ఏనాటిదో. ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. నవంబర్‌ 1న ఈ సినిమా విడుదల కానుంది. గతంలో ఛార్మి, శ్రియ, అనుష్క తదితర హీరోయిన్లు వేశ్య పాత్రల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు సదా కూడా అదే ప్రయత్నం చేస్తోంది.

యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. సినిమా ప్రచార చిత్రం చూస్తే, అడల్డ్‌ డైలాగ్స్‌తో పాటు, ఓ సోషల్‌ కాజ్‌తో కూడిన మెసేజ్‌ కూడా దాగి ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, ఫేడ్‌ అవుట్‌ అయిపోయిన సదా ఈ తరహా సినిమాతో బౌన్స్‌ బ్యాక్‌ అవుతుందా.? ఫుల్‌ డోస్‌ గ్లామరస్‌ హీరోయిన్లు కమర్షియల్‌ సినిమాల్లో చేస్తున్న ఎక్స్‌పోజింగే కొన్ని సార్లు బెడిసికొట్టేస్తోంది. అలాంటిది పాత కాలం నాటి నిర్మాణ విలువలతో సదా 'శ్రీమతీ 21 ఎఫ్‌' అంటూ ఏం సాధిస్తుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS