సుప్రీమ్ హీరో 'మెగా' భోజనాలు

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ పోలికలోనే కాదు, సేవా కార్యక్రమాల్లోనూ మేనమామలను పోలి ఉన్నాడు. ఇప్పటికే ఓ సేవా సంస్థ ద్వారా గిరిజనుల అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నాడు. మరో పక్క తనకి వీలు చిక్కినప్పుడల్లా ఇతర సేవా కార్యక్రమాల్లోనూ హుషారుగా పాల్గొంటూ ఉంటాడు. తాజాగా తనని కలవడానికి షూటింగ్ స్పాట్ కి నిన్న సుమారు 150మంది రాగా, వారందిరికి భోజన సదుపాయాలు కలిపించి అందరికి స్పూర్తిగా నిలిచాడు.

మొన్నీమధ్యనే శారీరక ఎదుగుదల లేని ఓ మొరగుజ్జు మనిషితో మోకాలిపై ఫోటో దిగి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. సాయి ధరమ్‌ తేజ్‌ ఈజ్‌ గ్రేట్‌ అంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా అవిటితనం శరీరానికే కానీ, మనసుకు కాదనీ తన పెద్ద మనసును చాటి చెప్పాడు ఈ పని ద్వారా తేజు. తేజుతో కలిసి ఫోటో దిగినందుకు సదరు వ్యక్తి చాలా సంతోషం వ్యక్తం చేశాడు. 

కష్టాల్లో ఉన్నవారికి తమ వంతు చేయూతనందివ్వడం మెగా ఫ్యామిలీకి కొత్తేమీ కాదు. అలా అని అదేదో పబ్లిసిటీ కోసం కూడా చేయదు మెగా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ చేసే సాయంలో చాలా వరకూ మీడియా దృష్టికి రానే రావు. సైలెంట్‌గా జరిగిపోతూనే ఉంటాయి. చిరంజీవి నుండీ, పవన్‌ కళ్యాణ్‌, రామ్‌చరణ్‌, ఇప్పుడు సాయి ధరమ్‌ తేజ్‌ ఇలా మెగా ఫ్యామిలీ నుండి సామాజిక సేవలో మునిగి తేలుతున్న వారే. కాగా తేజు పోస్ట్‌ చేసిన ఈ ఫోటో అయితే మాత్రం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అయ్యి కూర్చుంది. 

ఇక సినిమా విషయానికి వస్తే, ప్రస్తుతం మనోడు నటించిన 'జవాన్‌' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. డిశంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మెహరీన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని బి.వి.యస్‌.రవి తెరకెక్కించారు. తర్వాత వినాయక్‌ దర్శకత్వంలో తేజు మరో సినిమా షూటింగ్‌ దశలో ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS