రూటు మార్చిన మెగాహీరో.!

మరిన్ని వార్తలు

తొలి సినిమా నుండీ మేనమామలను మక్కీకి మక్కీ దించేస్తూ కెరీర్‌ స్టార్టింగ్‌లో విజయాలు చవిచూసి, ఇప్పుడు వరుస పరాజయాలతో రేసులో వెనకబడిపోయిన మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ కొంచెం రియలైజ్‌ అయ్యాడట. వరుసగా మూస కథలను ఎంచుకుని ఈ మధ్య బొక్క బోర్లా పడ్డాడు. దాంతో కథల విషయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. సొంత ఆలోచనలు పక్కన పెట్టేసి, స్నేహితులు, శ్రేయోభిలాషుల సలహాలు తీసుకుంటున్నాడట. అందులో భాగంగానే కిషోర్‌ తిరుమల డైరెక్షన్‌లో 'చిత్రలహరి' సినిమాకి సైన్‌ చేశాడు.

తాజాగా సెట్స్‌ మీదికెళ్లిన ఈ సినిమా లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనరే కానీ, ఈ సినిమాలో సాయి ధరమ్‌ తేజ్‌ని డైరెక్టర్‌ కిషోర్‌ తిరుమల సరికొత్తగా ప్రజెంట్‌ చేయనున్నాడట. తేజు కూడా ఈ సారి అస్సలు ఛాన్స్‌ తీసుకోవడం లేదట. ఫ్యాన్స్‌ తన నుండి ఏం ఎక్స్‌పెక్ట్‌ చేస్తారో ఆ అవుట్‌ పుట్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడనీ తెలుస్తోంది. 

మరోవైపు తేజు ఇంకా మారలేదనే వాదన వినిపిస్తోంది. మేనమామలను ఇమిటేట్‌ చేయడంలో. ఈ సినిమా కోసం ఓ రీమిక్స్‌ సాంగ్‌ ప్లాన్‌ చేస్తున్నాడట. ఆల్రెడీ మెగాస్టార్‌ చిరంజీవి సినిమాల్లోని రెండు పాపులర్‌ సాంగ్స్‌ని రీమిక్స్‌ చేసేసిన తేజు, ఈ సారి చిన్న మామయ్య పవన్‌ కల్యాణ్‌ సినిమాలోని సాంగ్‌ని రీమిక్స్‌ చేసే యోచనలో ఉన్నాడనీ తెలుస్తోంది. 

నివేదా పేతురాజ్‌, 'హలో' ఫేం కళ్యాణీ ప్రియదర్శిని హీరోయిన్లుగా నటిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS