మెగా మేనల్లుడి 'చిత్రలహరి' షురూ!

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ హీరోగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోన్న 'చిత్రలహరి' సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యింది. 'హలో' ఫేం కళ్యాణి ప్రియదర్శన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. సాయిధరమ్‌ తేజ పుట్టినరోజు వేడుకల్నీ సినిమా ప్రారంభోత్సవ వేడుకలో నిర్వహించేశారు. 

వరుస వైఫల్యాలతో యంగ్‌ హీరోల రేసులో వెనుకబడిపోయిన సాయిధరమ్‌ తేజ, ఈ మధ్య చిన్న బ్రేక్‌ తీసుకుని కొన్నాళ్ళపాటు విదేశాల్లో చక్కర్లు కొట్టాడు. అక్కడే ఫిట్‌నెస్‌ మీద ఫోకస్‌ పెట్టి, బరువు తగ్గడంతోపాటుగా కొన్ని 'ప్రత్యేకమైన విద్యలు' నేర్చుకున్నాడని సమాచారమ్‌. ఆ విద్యలేంటో, 'చిత్రలహరి' సినిమా చూస్తేనే తెలుస్తుందట. ఈ సినిమా ఓ కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా వుంటుందని చిత్ర దర్శక నిర్మాతలు అంటున్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్‌ అంటే, టాలీవుడ్‌లో ఇప్పుడు ప్రెస్టీజియస్‌ బ్యానర్లలో ఒకటిగా చెప్పుకోవుచ్చు. ఈ బ్యానర్‌ నుంచి ఏ సినిమా వచ్చినా, ఆ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో వుంటాయి. 'కొన్ని పొరపాట్లు జరిగాయి, వాటిని సరిదిద్దుకుంటున్నా..' అంటూ ఇటీవలే అభిమానుల్ని ఉద్దేశించి సాయిధరమ్‌ తేజ, సోషల్‌ మీడియా వేదికగా ఓ 'ఓపెన్‌ లెటర్‌' కూడా ప్రకటించిన సంగతి తెల్సిందే. 

'జవాన్‌', 'ఇంటెలిజెంట్‌' తదితర సినిమాలతో సాయిధరమ్‌ తేజ బాగా డీలాపడిపోయాడు. మళ్ళీ తాను రేసులోకి వచ్చేందుకు 'చిత్రలహరి' దోహదపడ్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడిప్పుడు సాయిధరమ్‌ తేజ్‌. ఆల్‌ ది బెస్ట్‌ అండ్‌ హ్యాపీ బర్త్‌ డే టు సాయిధరమ్‌ తేజ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS