సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులకు ఇంకా ఆందోళనగానే ఉంది. తేజ్ నుంచి ఇప్పటి వరకూ ఒక్క బైట్ కూడా బయటకు రాలేదు. ఒక్క వీడియో కూడా వదల్లేదు. అయితే.. తాజాగా థమ్సప్ సింబల్ చూపిస్తూ తేజ్ ఓ ఫొటోని ట్విట్టర్ లో పెట్టాడు. రిపబ్లిక్ ని హిట్ చేసి నందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇది ఓరకంగా ఫ్యాన్స్కి ఊరట ఇచ్చే విషయమే. దాంతో పాటుగా.. వైష్ణవ్ తేజ్ కూడా చైతూ ఆరోగ్యంపై అప్ డేట్ ఇచ్చాడు. ``అన్న వేగంగా కోలుకుంటున్నాడు. కాలర్ బోన్ దగ్గర ఫ్యాక్చర్ తప్ప మరే ప్రమాదమూ లేదు. రెండు మూడు నెలల్లో షూటింగ్ కి కూడా వస్తాడు`` అని ఓ స్వీట్ న్యూస్ చెప్పాడు.
అయితే ప్రస్తుతానికి తేజ్ ఆసుపత్రిలోనే ఉన్నాడు. డిశ్చార్జ్ అవ్వడానికి టైమ్ పడుతుంది. అదెప్పుడన్నది ఇంకా తెలీదు. మహా అయితే మరో వారంలో తేజూ ఇంటికి వెళ్లిపోవొచ్చు. అయితే తేజ్ నుంచి ఒక్క ఫొటో అయినా బయటకు వస్తే.. ఫ్యాన్స్ కి ఇంకాస్త రిలీఫ్ గా ఉంటుంది. తేజ్ డేంజర్ జోన్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేశాడు. కాకపోతే ఇది వరకటిలా తిరగాలంటే మరో మూడు నెలలు పడుతుంది.