అభిమానులకి సాయి ధరమ్ తేజ్ ‘మెగా’ విన్నపం

మరిన్ని వార్తలు

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ఆయన త్వరలో చేయబోయే చిత్రం కోసం ఒక కొత్త లుక్ తన అభిమానులకి పరిచయం చేసే పనులలో ఉన్నట్టుగా తెలుస్తున్నది.

ఈ క్రమంలో ఆయన నుండి మెగా అభిమానులకి ఒక విన్నపం అందింది. ఈ విన్నపం ఆయన స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు.

అదేంటంటే- రేపు తన పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులు పెద్ద ఎత్తున కట్ అవుట్ లు, కేకులు, ర్యాలీలు, బ్యానర్లతో వేడుకలు నిర్వహించబోతున్నట్టుగా తెలిసింది. దయచేసి వాటికోసం ఖర్చు పెట్టబోయే డబ్బుని ఎవరైనా ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న చిన్నారుల విద్యకోసం ఆ మొత్తాన్ని అందజేయాలని కోరుకున్నాడు.

అలా చేస్తే, మనవల్ల అవసరంలో ఉన్న ఒకరి జీవితం బాగుపడుతుంది అని చెప్పాడు. అదే విధంగా ఆయన ఈమధ్య నటించిన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడడంతో తన తప్పులని సమీక్షించుకుని ఒక మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తన మనసులోని మాటని బయటపెట్టాడు.

ఇక తేజ్ చేసిన ఈ పనిని అందరూ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS