'యాత్ర 2' ఫ్రెష్‌ అప్‌డేట్‌.!

మరిన్ని వార్తలు

మహి వి రాఘవ తెరకెక్కించిన 'యాత్ర' ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం అందుకుంది. అస్సలు అంచనాలే లేకుండా విడుదలైన ఈ సినిమాని ప్రజలు బాగా ఆదరించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో సాగిన చిత్రమిది. రాజశేఖర్‌రెడ్డి సీఎం అవడంతో ఆ సినిమా ముగుస్తుంది. ఆ సినిమాలోనే వైఎస్‌ జగన్‌ ప్రస్థావన తీసుకొచ్చారు డైరెక్టర్‌ రాఘవ. ఇక ఈ ఎలక్షన్స్‌లో వైఎస్‌ తనయుడు జగన్‌ భారీ మెజార్టీతో గెలిచి సీఎం పీటమెక్కబోతున్న నేపథ్యంలో మహి.వి.రాఘవ 'యాత్ర' పార్ట్‌ 2 తెరకెక్కిస్తానని అధికారికంగా అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. జగన్‌ పాదయాత్ర నేపథ్యంలో ఈ రెండో పార్ట్‌ ఉండబోతోందట.

 

అతి త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోందనీ తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్‌ మహి ట్విట్టర్‌ వేదికగా ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. 'వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్‌ జగన్‌ లేకుండా రాజశేఖర్‌ రెడ్డి కథకు ముగింపు ఉండదు. 'యాత్ర 2' ద్వారా ఈ ముగ్గురి కథ గురించి చెప్పి సినిమాకు ముగింపు చెప్తాను.. వైఎస్సార్‌ యాత్ర ఆయన తండ్రి రాజారెడ్డి సమాధి నుండి మొదలైంది. వైఎస్‌ జగన్‌ యాత్ర ఆయన తండ్రి రాజన్న సమాధి నుండి మొదలైంది.. అని రాఘవ పేర్కొన్నారు. ఈ సినిమాని కూడా 'యాత్ర' రూపొందించిన నిర్మాతలు విజయ్‌ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించనున్నారట. ఈ సినిమాలో జగన్‌ పాత్రధారి ఎవరనే విషయమై ఇంకా క్లారిటీ రాలేదు కానీ, తమిళ హీరో సూర్య పేరు ప్రచారంలో ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS