సాయి పల్లవికి గోల్డెన్‌ ఛాన్స్‌ మిస్సయ్యిందా.?

మరిన్ని వార్తలు

రెమ్యునరేషన్‌ కన్నా, సినిమాలో తన క్యారెక్టర్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇచ్చే అతి కొద్ది మంది హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. అందుకే సాయి పల్లవి హైబ్రీడ్‌ పిల్ల. సింగిల్‌ పీస్‌. తొలి సినిమాకే చెప్పేసింది. చెప్పడమే కాదు, అదే మాటపై నిలబడిపోతోంది కూడా. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఓ చిత్రం కోసం హీరోయిన్‌గా సాయి పల్లవిని అడిగారట. ఆ సినిమాకి సాయి పల్లవి నో చెప్పిందట. 

ఎందుకంటే, ఈ సినిమాలో సాయిపల్లవిది సెకండ్‌ హీరోయిన్‌ పాత్రట. మెయిన్‌ హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. శ్రీనివాస్‌ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రమిది. కాగా ఈ సినిమాలో మొదటి హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ పాత్ర కన్నా, సెకండ్‌ హీరోయిన్‌ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. అందుకే ఆ పాత్ర కోసం యాక్టింగ్‌ టాలెంట్‌ ఉన్న ముద్దుగుమ్మ అయితే బావుంటుందని సాయి పల్లవిని సంప్రదించారట. ఈ పాత్ర కోసం సాయి పల్లవికి భారీ స్థాయిలో రెమ్యునరేషన్‌ కూడా ఆఫర్‌ చేశారట. అది అక్షరాలా 2 కోట్లు. 

బెల్లంకొండ సినిమాల్లో హీరోయిన్స్‌ అందరికీ భారీ స్థాయిలో రెమ్యునరేషన్‌ ఆఫర్‌ చేస్తూంటారు. తొలి సినిమా నుండీ అదే కంటిన్యూ అవుతుంది. స్టార్‌డమ్‌, మోస్ట్‌ పాపులారిటీ ఉన్న ముద్దుగుమ్మల్ని ఎంచుకుంటారు అందుకే ఈ యంగ్‌ హీరో సినిమాలకి. హీరోయిన్స్‌ కూడా తమ స్టార్‌డమ్‌ని పక్కన పెట్టేసి, చెంగు చెంగున గెంతులేస్తూ బెల్లంకొండతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌కి సిద్ధమైపోతారు. 

కానీ ఈ విషయంలో సాయి పల్లవి మాత్రం పూర్తిగా భిన్నం. కెరీర్‌ స్టార్టింగ్‌లోనే ఈ స్థాయిలో రెమ్యునరేషన్‌ అందుకునే గోల్డెన్‌ ఛాన్స్‌ మిస్‌ చేసుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి శర్వానంద్‌తో 'పడి పడి లేచె' మనసు చిత్రంలో నటిస్తోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS