సల్మాన్ కి మూడు సార్లు BP పెరిగిందట

మరిన్ని వార్తలు

నిన్న కృష్ణజింకల వేటాడిన కేసులో జోద్ పూర్ సెషన్స్ కోర్టుహీరో సల్మాన్ ఖాన్ కి అయుదు ఏండ్ల జైలు శిక్ష వేసిన సంగతి విదితమే. దీనితో ఆయన నిన్న రాత్రి జోద్ పూర్ సెంట్రల్ జైలులో గడిపాడు.

ఆయన జైలులో నిన్న రాత్రి సాధారణ ఖైదిగా గడిపేశాడు అని సమాచారం. ఆయనకి ఆశారాం బాపు శిక్ష అనుభవిస్తున్న బ్యారక్ లో సల్మాన్ ని ఉంచారు. ఇక జైలు అధికారులు ఇచ్చిన ఆహారాన్ని ఆయన నిరాకరించడం, అదేసమయంలో ఆశారాం బాపు కోసం వచ్చిన ఆహారాన్ని ఈయనకి ఇవ్వగా కొద్దిగా తీసుకున్నట్టు తెలిసింది.

ఇక సల్మాన్ ఖాన్ ని ఉంచిన బ్యారక్ లో సదుపాయాలు పెద్దగ లేకపోవడంతో ఆయనకి ఇచ్చిన రగ్గుని నేలపైన పరిచి అక్కడే పడుకున్నట్టుగా జైలు అధికారులు తెలిపారు. అలాగే ఆయనకి రాత్రి మొత్తం మూడుసార్లు రక్తపోటుకి సంబంధించి హెచ్చుతగ్గులు వచ్చింది అని వెంటనే వైద్యులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చారట.

ప్రస్తుతం ఆయన తరపున లాయర్లు కేసు విచారణలో జరిగిన లోపాలని ఎత్తిచూపుతూ ఆయనకి బెయిల్ దక్కేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS