ఇక్కడా అక్కడా ఒకేసారి దున్నేస్తోన్న రామలక్ష్మి

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ సమంత ఇటీవల 'రంగస్థలం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఓ రేంజ్‌లో మెప్పించింది. రామలక్ష్మి మేనియా నుండి ప్రేక్షకులు ఇంకా కోలుకోలేదు. అంత సక్కగా ఆకట్టుకుంది ఆ పాత్ర ద్వారా సమంత. ఎల్లుండి 'మహానటి'తో మళ్లీ రానుంది. 

ఇకపోతే తెలుగు సినిమాల సంగతిటుంచితే, తమిళంలో సమంత నటించిన సినిమాలు రిలీజ్‌కు క్యూ కడుతున్నాయి. తెలుగుకి ఈక్వెల్‌గా సమంత తమిళంలోనూ జోరు చూపిస్తోంది. ఇటు తెలుగు ప్రేక్షకుల్నీ, అటు తమిళ ప్రేక్షకుల్ని సమానంగా అలరిస్తోంది సమంత. ప్రస్తుతం సమంత కోలీవుడ్‌లో రెండు చిత్రాల్లో నటిస్తోంది. కాస్త గ్యాప్‌లోనే ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా విశాల్‌తో సమంత నటించిన 'ఇరుంబుతిరై' చిత్రం సమంతకు చాలా చాలా స్పెషల్‌ అంటోంది. 

ఈ సినిమాను 'అభిమన్యుడు' పేరుతో తెలుగులో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. సైబర్‌ క్రైమ్స్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సెల్‌ఫోన్లు, ఇంటర్‌నెట్స్‌ వాడకం ఎంత ప్రమాదరకరకమైందో ఈ చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం చేశారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా చూశాక ప్రజల్లో చాలా చాలా మార్పులు రావచ్చుననీ, విచ్చల విడిగా ఇంటర్నెట్స్‌. సాఫ్ట్‌ మొబైల్స్‌ యూజ్‌ చేసేవారికి ఈ సినిమా ఓ హెచ్చరిక కానుందని సమంత చెబుతోంది. ఈ సినిమాలో చాలా ఆశక్తికరమైన అంశాలను చూపించారట. 

అలాంటి సంఘటనలు తమ తమ జీవితాల్లో జరిగాయని తన ఫ్రెండ్స్‌ కొంత మంది సమంతతో చెప్పారట కూడా. అలా వాస్తవికతకు అతి దగ్గరగా ఈ సినిమాలోని సన్నివేశాలు ఉంటాయని సమంత చెబుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS