రెడ్డిగారి తదుపరి చిత్రం మహేష్‌తోనే!

మరిన్ని వార్తలు

'అర్జున్‌రెడ్డి' సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాకే సంచలనాలు సృష్టించేశాడు డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా. ఇదే సినిమాతో బాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తానేంటో ప్రూవ్‌ చేసుకోవాలనుకుంటున్నాడు. తెలుగులో కలిసొచ్చిన 'అర్జున్‌రెడ్డి'ని హిందీలోనూ రీమేక్‌ చేస్తున్నాడు. 'కబీర్‌సింగ్‌' టైటిల్‌తో షాహిద్‌ కపూర్‌, కైరా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, సందీప్‌ రెడ్డి తదుపరి చిత్రంపైనా కొన్ని వార్తలు బయటికొస్తున్నాయి.

 

సందీప్‌ రెడ్డి తదుపరి చిత్రం మహేష్‌బాబుతో ఉండొచ్చనే ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేకపోలేదు. ఆల్రెడీ సందీప్‌రెడ్డి, మహేష్‌కి ఓ స్టోరీ లైన్‌ వినిపించిన మాట వాస్తవమేనట. దాన్ని మెచ్చిన మహేష్‌ డెవలప్‌ చేసి తీసుకురమ్మన్నాడట. ప్రస్తుతం ఆ కాన్సెప్ట్‌ ఇంకా కొలిక్కి రాలేదట. కానీ, త్వరలోనే దానిపై దృష్టి పెట్టనున్నాడట సందీప్‌ రెడ్డి. అంటే, మహేష్‌తో సందీప్‌ సినిమా పక్కానే అని అర్ధం చేసుకోవాలి. అంతకన్నా ముందే సందీప్‌ రెడ్డి ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ని తెరకెక్కించాలనుకుంటున్నాడట. ఈ సినిమాలో హీరో ఎవరనే విషయమై సందీప్‌ రెడ్డి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ, త్వరలోనే ఆ ప్రాజెక్ట్‌ వివరాలూ, హీరో ఇతరత్రా విషయాలూ వెల్లడి చేయనున్నాడట రెడ్డిగారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS