రైట్ టైంలో ‘సరిలేరు నీకెవ్వరు’ టెలివిజన్ ప్రీమియర్ని ప్లాన్ చేశారు.. ఆ ప్లాన్ అద్భుతంగా వర్కవుట్ అయ్యింది కూడా! నిన్న ఉగాది పర్వదినాన, టెలివిజన్లో ‘సరిలేరు నీకెవ్వరు’ వస్తోంటే, జనం దాదాపుగా ఈ సినిమాకే అతుక్కుపోయారనడం అతిశయోక్తి కాదేమో. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎన్ని వున్నా, వాటిల్లో ఇప్పటికే ‘సరిలేరు నీకెవ్వరు’ స్ట్రీమ్ అవుతున్నా, టెలివిజన్ ప్రీమియర్కి వున్న కిక్కే వేరప్పా. మహేష్ అభిమానులు నిన్నటి ‘సరిలేరు నీకెవ్వరు’ టెలివిజన్ ప్రీమియర్ని మేగ్జిమమ్ ఎంజాయ్ చేశారు. సాధారణ సినీ ప్రేక్షకులు కూడా ‘సరిలేరు నీకెవ్వరు’కి బాగానే కనెక్ట్ అయిపోయినట్లు తెలుస్తోంది.
కరోనా ఎఫెక్ట్ కారణంగా, ఎవరూ ఇళ్ళల్లోంచి బయటకు రాలేని పరిస్థితి. ఇంకో వైపు, ‘సరిలేరు నీకెవ్వరు’కి ధీటుగా ఇంకో పెద్ద సినిమా ఏదీ టెలివిజన్లో లేకపోవడంతో, మహేష్బాబు సినిమాకి టీఆర్పీ పంట పండినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన విషయం విదితమే. రష్మిక మండన్న, మహేష్తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది ఈ సినిమా కోసం. ఈ మధ్య పెద్ద సినిమాల టెలివిజన్ ప్రీమియర్స్కి ‘టీఆర్పీ రేటింగ్స్’ దారుణంగా వస్తున్నాయి. మళ్ళీ ‘సరిలేరు నీకెవ్వరు’తో రికార్డుల మోత మోగేలా వుంది బుల్లితెరపై.