వెండి తెర స్టార్లూ, బుల్లి తెర స్టార్లూ వేరు. త్వరలో ఓటీటీ స్టార్లు కూడా రాబోతున్నారు. అవును మరి... వెండితెరకూ, బుల్లి తెరకూ... ప్రత్యామ్నాయంగా మారిపోయింది ఓటీటీ. అందులోంచి కొత్త స్టార్లు పుట్టుకొస్తున్నారు. సత్యదేవ్ కూడా అలాంటి స్టారే. ఇటీవల ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ చేశాడు సత్యదేవ్. అది బాగానే సక్సెస్ అయ్యింది. మంచి రేటింగులు వచ్చాయి. సత్యదేవ్ నటించిన రెండు సినిమాలు.. ఇప్పుడు నేరుగా ఓటీటీలో స్ట్రీమ్కానున్నాయి. సత్యదేవ్ సినిమాలు 'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య', '47 డేస్' విడుదలకు సిద్ధమయ్యాయి. థియేటర్లు తెరచి ఉంటే, ఈ రెండు సినిమాలూ ఎప్పుడో రిలీజ్ అయిపోయేవి.
కానీ.. కరోనా వల్ల థియేటర్లు మూసుకోవాల్సివచ్చింది. ఇలాంటి సమయాల్లో ఓటీటీనే పెద్ద దిక్కయిపోయింది. అందుకే సత్యదేవ్ నటించిన ఈ రెండు కొత్త సినిమాలూ నేరుగా ఓటీటీలో ప్లే అయిపోతున్నాయి. అమేజాన్ సంస్థ 'ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య' సినిమాని మంచి రేటిచ్చి కొనుగోలు చేసేసిందని టాక్. `47 డేస్` త్వరలోనే జీ5 లో స్ట్రీమింగ్ అవ్వబోతోందట. ఆ రెండు సినిమాల రిలీజ్ డేట్లూ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు. వెబ్ సిరీస్ల కోసం సత్యదేవ్కి మంచి ఆఫర్లు వస్తున్నాయని, త్వరలోనే రెండు వెబ్ సిరీస్లలో సత్యదేవ్ కనిపించనున్నాడని టాక్.