చైతూ ఎఫెక్ట్... మైత్రీపై ప‌డిందా?

మరిన్ని వార్తలు

మైత్రీ మూవీస్‌.... టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టి. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన‌వి నాలుగు సినిమాలే. అయితే.. అందులో మూడు బ్లాక్ బ్ట‌స్ట‌ర్స్‌. అందుకే మైత్రీ సంస్థ పేరు నిల‌బ‌డిపోయింది. చేతిలో ప‌ది, ప‌దిహేను సినిమాలు పెట్టుకుని - టాలీవుడ్‌నే శాశించే స్థాయికి ఎదుగుతోంది మైత్రీ. అలాంటి మైత్రీకి తొలి ఫ్లాప్‌.. `స‌వ్య‌సాచి`తో త‌గిలింది.

ఈ సినిమాపై ముందు నుంచీ మంచి అంచ‌నాలే ఉన్నాయి.  వ‌రుస విజ‌యాల‌తో ఉన్న మైత్రీ మూవీస్‌, రెండు హిట్లు కొట్టిన‌... చందూ మొండేటి, మాధ‌వ‌న్, భూమిక లాంటి స్టార్ కాస్టింగ్‌.. దానికి తోడు కీర‌వాణి సంగీతం ఇవ‌న్నీ క‌ల‌సి `స‌వ్య‌సాచి`పై ఆశ‌లు పెంచేశాయి. అయితే.. ఒకే ఒక్క భ‌యం.. నాగ‌చైత‌న్య‌. 

చైతూకి ఈమ‌ధ్య స‌రైన విజ‌యాల్లేవు. తాజా చిత్రం `శైల‌జా రెడ్డి అల్లుడు` కూడా ఫ్లాప్ అయ్యింది. ఆ ప్ర‌భావం స్య‌వ‌సాచిపై ప‌డుతుందేమో అనుకున్నారు. దాంతో పాటే మైత్రీ మూవీస్ వ‌రుస విజ‌యాలు కొడుతోంది క‌దా, ఆ సెంటిమెంట్ చైతూకి క‌లిసొస్తుందేమో అన్న నమ్మ‌కాలు కూడా ఉండేవి. అయితే ఇప్పుడు చైతూ ఎఫెక్ట్.. మైత్రీపై ప‌డిందేమో అనిపిస్తోంది. తొలిరోజే ఈ సినిమా ఫ్లాప్ టాక్ మూట‌గ‌ట్టుకుంది. మైత్రీ ఖాతాలో తొలి ఫ్లాప్ ప‌డిపోయింద‌ని సినీ విశ్లేష‌కులు తేల్చేశారు. 

సో... మైత్రీ విజ‌యాల ప‌రంప‌ర‌కు చైతూ బ్రేక్ ఇచ్చాడ‌న్న‌మాట‌. ఈ సంస్థ నుంచే ఈనెల 16న `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ` రాబోతోంది. ఆ సినిమా ఎలా ఉంటుందో..??


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS