హరీష్‌ మిస్సయ్యాడు, అజయ్‌ దక్కించుకుంటాడా.?

మరిన్ని వార్తలు

శర్వానంద్‌, నితిన్‌ కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్‌ తెరకెక్కనుందంటూ ఆ మధ్య వార్తలొచ్చాయి. 'దాగుడు మూతలు' అనే టైటిల్‌తో ఆ సినిమాకి హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ, ఆ ప్రాజెక్ట్‌ ఎందుకో పట్టాలెక్కలేదు సరికదా.. మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌తో హరీష్‌ శంకర్‌ 'గద్దలకొండ గణేష్‌' సినిమాని సక్సెస్‌ఫుల్‌గా తెరకెక్కించి, బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టి కూర్చున్నాడు. తన మల్టీ స్టారర్‌ ప్రాజెక్ట్‌ మాత్రం అటకెక్కేసింది. కాసేపు ఆ సంగతి పక్కన పెడితే, ఇప్పుడు మరో మల్టీ స్టారర్‌ తెరపైకి వచ్చింది. అయితే, హీరోగా శర్వా ఉన్నాడు. కానీ, కథ వేరే, దర్శకుడు వేరే. 'ఆర్‌ ఎక్స్‌ 100' సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అజయ్‌ భూపతి ఆ సినిమా తర్వాత ఓ మల్టీ స్టారర్‌ కథని సిద్ధం చేసుకుని హీరోల వెంట పడుతున్న సంగతి తెలిసిందే.

 

రవితేజ, నాగ చైతన్య.. ఇలా పలువురు హీరోల వద్దకు తన కథతో వెళ్లాడు అజయ్‌ భూపతి. కానీ, వారెవరికీ కుదరకపోవడంతో, ఇదే ప్రాజెక్ట్‌ ఇప్పుడు శర్వా చేతికి వచ్చిందని తెలుస్తోంది. కథ నచ్చింది. డైరెక్టర్‌ ఓకే. మల్టీ స్టారర్‌ కాబట్టి, ఇంకో హీరో కావాలి. ప్రస్తుతం ఆ హీరోని వెతికే పనిలో డైరెక్టర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ హీరో నితిన్‌ అవుతాడా? ఒకవేళ అలా అయితే, హరీష్‌ శంకర్‌ ద్వారా వర్కవుట్‌ కాని మల్టీ స్టారర్‌ అజయ్‌ భూపతి వల్ల వర్కవుటవుతుంది అనుకోవచ్చు. కానీ, నితిన్‌ ప్రస్తుతం చాలా బిజీ. త్వరలో 'భీష్మ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ తర్వాత నితిన్‌ చేయాల్సిన రెండు ప్రాజెక్టులు ఆల్రెడీ లైన్‌లో ఉన్నాయి. వెంకీ అట్లూరితో 'రంగ్‌దే' చిత్రంలోనూ, చంద్రశేఖర్‌ ఏలేటితో 'చదరంగం' వంటి విలక్షణ చిత్రాలు నితిన్‌ ఖాతాలో ఉన్నాయి. మరి ఈ తరుణంలో నితిన్‌ డేట్స్‌ దొరకడం కష్టమే. అయితే, అజయ్‌ తన కథతో నితిన్‌ని మెప్పించగలిగితే వదులుకునే అవకాశం లేదు. చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS