ఎక్స్‌ప్రెస్‌ రాజా' వేర్‌ ఆర్‌ యూ.!

మరిన్ని వార్తలు

విలక్షణ నటుడిగా హీరో పాత్రలతో పాటు, సపోర్టింగ్‌ రోల్స్‌లోనూ బలమైన క్యారెక్టర్స్‌ పోషించి నటనలో తనదైన శైలి ప్రత్యేకతను చాటిన హీరో శర్వానంద్‌. యంగ్‌ డైరెక్టర్‌ సుజిత్‌ దర్శకత్వంలో వచ్చిన 'రన్‌ రాజా రన్‌' మూవీ శర్వానంద్‌ కెరీర్‌ని టర్న్‌ చేసేసింది. ఆ సినిమాతో నక్క తోక తొక్కినట్లైంది శర్వానంద్‌కి. 

'రన్‌ రాజా రన్‌'తో మొదలుపెట్టిన హిట్స్‌ పరుగు నిన్నటి 'మహానుభావుడు' దాకా ఎక్స్‌ప్రెస్‌ వేగంతోనే సాగింది. అయితే ఎందుకో ఈ మధ్య శర్వానంద్‌ కాస్త డీలా పడ్డాడు. అందుకు కారణం ఫెయిల్యూర్స్‌ అస్సలు కాదు. ప్రస్తుతం శర్వానంద్‌, సాయి పల్లవి జంటగా 'పడి పడి లేచె మనసు' చిత్రం తెరకెక్కుతోంది. హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకుడు. అయితే ఎక్స్‌ప్రెస్‌ వేగంతో సినిమాలు కంప్లీట్‌ చేసే శర్వానంద్‌కి ఎందుకో ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. 

ఎప్పుడో షూటింగ్‌ స్టార్ట్‌ అయిన 'పడి పడి లేచె మనసు' పడుతూ లేస్తూ నత్త నడకన షూటింగ్‌ కొనసాగుతోంది. శర్వా లెక్కల ప్రకారం ఈ దసరాకే మనోడి నుండి ఓ సినిమా రావాల్సి ఉంది. అయితే అది కుదరలేదు. సరికదా. అసలు సంక్రాంతి బరిలో అయినా మనోడు ఉంటాడో లేదో డౌట్‌గానే ఉంది. చిత్ర యూనిట్‌ అయితే డిశంబర్‌కల్లా ఈ సినిమాని కంప్లీట్‌ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారట. అయితే ఆ టార్గెట్‌ని రీచ్‌ అయ్యే అవకాశాలు కనిపించడం లేదనేది తాజా సమాచారమ్‌. 

అసలే ఫెస్టివల్‌ హీరో అనే పేరున్న శర్వానంద్‌కి ఎందుకిలా జరుగుతోందబ్బా.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS