బిజినెస్ అదిరింది క‌దా... శ‌ర్వా!!

మరిన్ని వార్తలు

ఓ సినిమా విడుద‌ల‌కు ముందే లాభాల్ని సంపాదించుకోవ‌డం అంటే ఈరోజుల్లో మామూలు విష‌యం కాదు. స్టార్ హీరోల సినిమాలు సైతం.. ప్రీ రిలీజ్ బిజినెస్ విష‌యంలో త‌త్త‌ర‌పాటుకు గుర‌వుతున్నాయి. ఈ వారం విడుద‌ల అవుతున్న మూడు సినిమాల్లో టేబుల్ ప్రాఫిట్ ద‌క్కించుకున్న సినిమా 'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు' మాత్ర‌మే. రూ.34 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన చిత్ర‌మిది. శ‌ర్వా కెరీర్‌లో ఇంత ఖ‌ర్చు పెట్టి తీసిన సినిమా ఇదే. 

 

అయితే..రూ.38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో విడుద‌ల‌కు ముందే రూ.4 కోట్ల టేబుల్ ప్రాఫిట్ ద‌క్కించుకుంది. ఏసియ‌న్ ఫిల్మ్ ఈ సినిమాని అవుట్ రేటుకి కొనుక్కొంది.  నైజాంలో ఈ సినిమాని రూ.6 కోట్ల‌కు అమ్మేశారు. సీడెడ్ లో రూ.3 కోట్లు ప‌లికింది. ఆంధ్రాలో రూ.9 కోట్ల‌కు అమ్ముడైంది. ఓవ‌ర్సీస్ లో రూ.3.5 కోట్లు ప‌లికాయి. శాటిలైట్‌, డిజిట‌ల్‌, హిందీ రైట్స్ రూపంలో మంచి లాభాలే వ‌చ్చాయి. 

 

శ‌ర్వానంద్ కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ అత్య‌ధిక వ‌సూళ్లు అందుకున్న సినిమా 'మ‌హానుభావుడు'. ఈ చిత్రానికి రూ.25 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చాయి. ఇప్పుడు ఈ రికార్డుని దాటేస్తే... 'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు' పంపిణీ దారుల్నీ గ‌ట్టెక్కిస్తుంది. క్రిస్మ‌స్ సెల‌వు క‌ల‌సి రావ‌డం... ఈ వారం రాబోతున్న సినిమాల‌కు ప్ల‌స్ పాయింట్‌. ల‌వ్ స్టోరీ కాబట్టి.. యూత్‌కి న‌చ్చితే.. ఈ సినిమా నిల‌బ‌డిపోగ‌ల‌దు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS