శివానీ రాజశేఖర్‌ సినిమా ఆగిపోవడం నిజమే?

By iQlikMovies - May 27, 2019 - 17:00 PM IST

మరిన్ని వార్తలు

జీవితా రాజశేఖర్‌ దంపతుల పెద్ద కుమార్తై శివానీ రాజశేఖర్‌ హీరోయిన్‌గా '2 స్టేట్స్‌' సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. అడవిశేష్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. చాలా కాలం క్రితమే సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయితే, ఈ మధ్య శివానీ సినిమా ఆగిపోయిందంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. స్వయానా ఈ సినిమా నిర్మాతే ఈ ప్రచారం చేయిస్తున్నారనేది ఓ వాదన. ఎం.ఎల్‌.వి సత్యనారాయణ ఈ సినిమాకి నిర్మాత.

 

వెంకటరెడ్డి దర్శకుడిగా పని చేస్తున్నారు. అయితే, దర్శకుడు ముందు అనుకున్న కథకి మధ్యలో చిన్నా, చితకా మార్పులు చేస్తున్నారనీ, అది నచ్చని నిర్మాత ఈ సినిమా నుండి ఆయన్ని తప్పించే క్రమంలో ఈ విధంగా చెడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆ విషయమై దర్శకుడు, నిర్మాతపై కేసు పెట్టాడట. త్వరలో ఆ కేసు విచారణకు రానుందట.

 

కేసు విచారణకు వచ్చేంతవరకూ సినిమాని తాత్కాలికంగా వాయిదా వేశారనీ తెలుస్తోంది. అయితే, ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు, నిర్మాణ భాగస్వామ్యం కూడా కలిగిన వెంకటరెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాని ఆపేది లేదనీ, రీమేక్‌ రైట్స్‌లో తనకూ భాగం ఉందనీ అంటున్నారు. ఏమో చూడాలి మరి, శివానీ తొలి సినిమాకే ఇలాంటి కష్టాలు రావడమేంటో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS