రాజశేఖర్ కారుకి ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న నేపథ్యంలో శంషాబాద్ పెద్ద గోల్కొండ వద్ద ఓఆర్ఆర్పై నటుడు రాజశేఖర్ కారు బోల్తా కొట్టింది. సమయానికి బెలూన్స్ తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారు ఫోటోలు బయటికి వచ్చాయి. కానీ రాజశేఖర్ కనిపించలేదు. కారు నుజ్జునుజ్జు అయిపొయింది. దీంతో ఆయనకి ఎలాంటి గాయాలు తగిలాయో అనే ఆందోళన నెలకొంది అభిమానుల్లో.
కాగ ఈ ప్రమాదంపై రాజశేఖర్ కుమార్తె శివాత్మిక స్పందించారు. 'నాన్న ప్రమాదానికి గురైన విషయం నిజం. అయితే నాన్న అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు లేకుండా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇప్పుడు నాన్న బాగున్నారు. మీ అందరి ప్రేమకు, నాన్న త్వరగా కోలుకోవాలన్న మీ ప్రార్థనలకు కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేసింది శివాత్మిక.