'రాజా'కి 'శృతి' కుదిరిందిగా!

By Inkmantra - October 30, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

లాంగ్‌ గ్యాప్‌ తర్వాత శృతిహాసన్‌ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో 'కాటమరాయుడు' సినిమా తర్వాత శృతిహాసన్‌ తెలుగులో నటించింది లేదు. ఈ గ్యాప్‌లో లవ్‌, డేటింగ్‌ అంటూ ప్రియుడితో ఎంజాయ్‌ చేసింది. ఏదో రీజన్‌ కారణంగా ప్రియుడితో బ్రేకప్‌ చేసుకుని, మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీ హీరోయిన్‌గా చెలామనీ అయ్యి, టాలీవుడ్‌లో దాదాపు నెంబర్‌ వన్‌ ఛైర్‌ని అధిరోహిస్తుందన్న టైమ్‌లో కెరీర్‌ని చేతులారా పాడు చేసుకుందనే విమర్శల్ని ఎదుర్కొంది శృతిహాసన్‌.

 

ఎలాగైతేనేం, చివరికి తన తప్పు తెలుసుకున్నట్లుగా మళ్లీ కెరీర్‌పై దృష్టి పెట్టింది. ఇక నుండి వరుస సినిమాల్లో నటిస్తానని చెబుతోంది. ప్రస్తుతం తమిళంలో 'లాభం' సినిమాలో నటిస్తోంది. విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక టాలీవుడ్‌కి వచ్చేసరికి, మాస్‌ రాజా రవితేజ సినిమాతో శృతిహాసన్‌ ఎంట్రీ ఇవ్వనుందన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. ఇప్పుడా ప్రచారం నిజమైంది.

 

మాస్‌ రాజా రవితేజ, శృతిహాసన్‌ జోడీ కుదిరింది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ చేయబోయే సినిమా కోసం హీరోయిన్‌గా శృతిహాసన్‌ ఎంపికైంది. గతంలో గోపీచంద్‌ మలినేని, రవితేజ కాంబినేషన్‌లో 'డాన్‌ శీను', 'బలుపు' చిత్రాలు వచ్చాయి. 'బలుపు'లో శృతిహాసన్‌ నటించింది. రవితేజ - గోపీచంద్‌ హ్యాట్రిక్‌ మూవీ శృతిహాసన్‌కి కూడా 'లాభం' తెచ్చిపెడుతుందా.? చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS