మనదేశంలోని నటులందరూ హాలీవుడ్ బాట పడుతున్నట్టు అనిపిస్తుంది. హిందీ, తెలుగు, తమిళ నటులంతా హాలీవుడ్ చిత్రాలలో పాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
అయితే ఈ ట్రెండ్ కి భిన్నంగా ఒక హీరో తన హాలీవుడ్ ఎంట్రీ ఒక దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఆ చిత్రంలో పాటలు అలాగే ఇంటర్వెల్ కూడా ఉండవు అని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.
అంతేకాకుండా ఈ చిత్రానికి మాటలు ప్రముఖ దర్శకుడైన గౌతం మీనన్ అందిస్తుడగా, ఛాయాగ్రహణం ప్రముఖ టెక్నీషియన్ అయిన సంతోష్ శివన్ అందివనున్నారట. త్వరలోనే ఈ చిత్రం మొదలుకానుంది అని తెలిపాడు.
మొత్తానికి శింబు ట్రెండ్ ఫాలో అవ్వకుండా ట్రెండ్ ని సృష్టిస్తున్నాడు.