విజయ్‌ సేతుపతి సినిమాకి బాహుబలి దెబ్బ!

మరిన్ని వార్తలు

విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి నటించిన 'సింధూబాద్‌' చిత్రం ఈ శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. అందుకు కారణం బాహుబలి నిర్మాతలు. అదేంటీ.. తమిళ సినిమాకీ, బాహుబలి నిర్మాతలకూ ఏం సంబంధం అనుకుంటున్నారా.? అక్కడికే వచ్చేస్తున్నాం. బాహుబలి సినిమాని తమిళంలో ప్రముఖ నిర్మాత రాజరాజన్‌ విడుదల చేశారు. ఆ సినిమా తెలుగులోనూ కాదు, తమిళంలోనూ మంచి వసూళ్లు రాబట్టింది.

 

అయితే, ఇప్పటి వరకూ తమకు రావల్సిన అమౌంట్‌ని రాజరాజన్‌ తిరిగివ్వలేదనీ 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో రాజరాజన్‌ నిర్మించిన 'సింధూబాద్‌' సినిమా విడుదలపై ఆయన కేసు వేశారు. ఈ సినిమాతో పాటు, రాజరాజన్‌ నిర్మాణంలో రూపొందిన మరో సినిమా 'ఎన్నై నోకి పాయుమ్‌ తోటా' అనే సినిమా పైనా ఆయన కేసు వేశారు. ఈ నేపథ్యంలో హైద్రాబాద్‌ కోర్టు ఈ రెండు సినిమాల విడుదల పైనా తాత్కాలిక స్టే విధించింది.

 

కానీ, రాజరాజన్‌ తన సహనిర్మాతలతో కలిసి 'సింధూబాద్‌' విడుదల చేసేందుకు ప్రయత్నించగా అక్కడా చుక్కెదురైంది ఈ నిర్మాతకి. ధియేటర్‌ యజమానులు అందుకు ఒప్పుకోలేదు. సినిమా విడుదలపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ, డిజిటల్‌ కంటెంట్‌ ప్రొవైడర్స్‌ నుండి సర్టిఫికెట్‌ తీసుకొస్తేనే స్క్రీనింగ్‌ వేస్తామని వారు చెప్పారు. దాంతో విజయ్‌ సేతుపతి సినిమా విడుదల తాత్కాలికంగా వాయిదా పడింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS