తేజ దర్శకత్వం వహించిన సినిమా `సీత`. కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా నటించారు. ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈమధ్య తేజ ఫామ్ కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డారు. తన సినిమాలన్నీ వరుసగా ఫ్లాపులయ్యాయి. నేనే రాజు నేనే మంత్రితో ఆయన మళ్లీ తేరుకున్నారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు దండుకుంది.
అందుకే `సీత`కు బిజినెస్ పరంగా క్రేజ్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన థియేటరికల్ రైట్స్ దాదాపుగా 13 కోట్లకు అమ్ముడయ్యాయి. శాటిలైట్, డిజిటల్ కలిపి మరో పది కోట్లయినా వస్తాయి. ఏ విధంగా చూసుకున్నా `సీత`కు ఇది మంచి బేరమే. నైజాంలో ఈ సినిమాకి రూ.4 కోట్లకు అమ్మేశారు. సీడెడ్లో 2 కోట్లు వచ్చాయి. ఈస్ట్ కోటి రూపాయలు పలికింది. ఉత్తరాంధ్ర 1.3కి అమ్ముడుపోయింది.
ఓవర్సీస్ లో నిర్మాతలే సొంతంగా విడుదల చేసుకుంటున్నారు. మహర్షి జోరు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో సీతకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలున్నాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకునేవిధంగా ఉండడంతో... సీతపై అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ఏమాత్రం బాగున్నా ఈ 13 కోట్లని రాబట్టుకోవడం తేలికైన పనే. మరి సీత ఏం చేస్తుందో చూడాలిక.