కరోనా కాటుకి టాలీవుడ్ వణికిపోతోంది. ఇటీవలే ఓ నిర్మాత కరోనాతో చనిపోయారు. ఇప్పుడు ఓ హీరో తండ్రి కూడా కరోనాకి బలి కావల్సివచ్చింది. ఆయనే మంగం వెంకట దుర్గారామ్ ప్రసాద్.
ఈరోజుల్లో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ గుర్తున్నాడు కదా. ఆయన తండ్రి దుర్గారామ్ ప్రసాద్. కొన్ని రోజులుగా ఆయన కరోనాతో బాధ పడుతూ.... విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. శ్రీని హీరోగా నిలబెట్టాలని తొలి నాళ్లలో దుర్గారామ్ చాలా ప్రయత్నాలు చేశారు. ఈ రోజుల్లోతో శ్రీకి బ్రేక్ వచ్చినా,ఆ తరవాత దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. తండ్రి మరణంతో శ్రీ శోక సముద్రంలో మునిగిపోయాడు. ఈరోజే దుర్గారమ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.