లాక్ డౌన్ వల్ల సెలబ్రెటీలంతా ఇల్లు వదిలి బయటకు రావడం లేదు. వాళ్లని ఆడియో ఫంక్షన్లలో చూడడం కుదరడం లేదు గానీ, సోషల్ మీడియాలో మాత్రం మహా యాక్టీవ్ గా ఉంటున్నారు. అయితే అయ్యింది గానీ, ఈ హౌస్ అరెస్ట్ వల్ల.. వాళ్లలోని కొత్త టాలెంట్ ఇప్పుడు అభిమానులకు పరిచయం అవుతోంది. మొన్నామధ్య కాజల్ వంటింట్లో దూరి ఆమ్లెట్ వేసింది. సుమ పులిహోర చేసి ఊరించింది. ఇప్పుడు శ్రీముఖి చికెన్ బిర్యానీ వండి.. ఆహా అనిపించింది. క్యారెంటెన్ తో.. శ్రీముఖి ఇల్లు వదిలి బయటకు రావడం లేదు. షూటింగులు, షోలూ లేవు. దాంతో బోలెడంత సమయం దొరికింది.
ఈ టైమ్ గ్యాప్ని శ్రీముఖి బాగా వాడుకుంటోంది. వంటింట్లో దూరి ప్రయోగాలు చేస్తోంది. ఈరోజు చికెన్ బిరియానీ చేసి, ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. శ్రీముఖి అప్పుడుప్పుడూ వంట వండుతుంది. అది తనకు హాబీ. అయితే ఎప్పుడూ ఆ వీడియోని పోస్ట్ చేయలేదు. బిరియానీ వండి, ఆ రెసిసీ కూడా తన ఫ్యాన్స్ తో పంచుకుంది. బిరియానీ టేస్ట్ ఎలా ఉందో తెలీదుగానీ... వీడియో చూస్తుంటే నోరూరిపోవడం ఖాయం.