శ్రీరెడ్డి బ్లాక్‌ నెయిల్‌ పాలిష్‌ 'కథ'

మరిన్ని వార్తలు

శ్రీరెడ్డి మళ్ళీ మొదలు పెట్టింది.. కొన్నాళ్ళు చెన్నైకి పారిపోయిన శ్రీరెడ్డి, అక్కడేవో అవకాశాలు సంపాదించానని చెప్పిందిగానీ, తమిళ తంబీలు తరిమేసినట్టున్నారు, మళ్ళీ హైద్రాబాద్‌లో వచ్చిపడింది. వస్తూనే, 'సంచలన ఆరోపణలు' షురూ చేసింది. జనసేన పార్టీ మీదా, ఆ పార్టీ నాయకుల మీదా, జనసేనాని పవన్‌కళ్యాణ్‌ మీదా జుగుప్సాకరమైన మాటలతో సోషల్‌ మీడియా వేదికగా విరుచుకుపడ్తోంది శ్రీరెడ్డి. మరోపక్క తన మాజీ ప్రియుడు దగ్గుబాటి అభిరామ్‌పైనా విరుచుకుపడింది.

 

'నువ్వు నా మీద ఆధారపడినప్పుడు.. నేను నీ మీద ఆధారపడినప్పుడు..' అంటూ ఓ కొత్త కథ చెప్పింది శ్రీరెడ్డి. 'నా బ్లాక్‌ నెయిల్‌ పాలిష్‌ అంటే నీకు ఇష్టం..' అనే విషయాన్ని గుర్తుచేసింది. ఓ జుగుప్సాకరమైన ఫొటో కూడా పోస్ట్‌ చేసింది సోషల్‌ మీడియాలో. నిర్మాత దగ్గుబాటి సురేష్‌ తనయుడు దగ్గుబాటి అభిరామ్‌ తనను వాడుకుని వదిలేశాడంటూ కొన్నాళ్ళ క్రితం కొన్ని ఫొటోల్ని కూడా విడుదల చేసింది శ్రీరెడ్డి. అయితే ఆ తర్వాత 'బేరసారాలు - బ్లాక్‌మెయిలింగ్‌' ఆరోపణల వ్యవహారం వెలుగు చూశాక శ్రీరెడ్డి చెన్నైకి పారిపోయిన సంగతి తెల్సిందే. 

 

పలువురు దర్శకులు, నిర్మాతలపైనా శ్రీరెడ్డి జుగుప్సాకరమైన ఆరోపణలు చేయడం చూశాం. తమిళ నటుడు విశాల్‌, నటుడు దర్శకుడు కొరియోగ్రాఫర్‌ లారెన్స్‌లపైన కూడా ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కింది శ్రీరెడ్డి. పబ్లిసిటీ తక్కువయ్యిందో ఏమో మళ్ళీ తెలుగు సినిమాలపైనా, తెలుగు రాజకీయాలపైనా దృష్టి సారించిన ఈ భామకి ఎన్నికల వేళ పబ్లిసిటీ గిట్టుబాటవుతుందంటారా? 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS