ఇంతకీ 'బంగ్లా' లో శ్రీదేవి ఎవరు?

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియా సెన్సేషనల్‌ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ బాలీవుడ్‌లో నటిస్తున్న తొలి చిత్రం 'శ్రీదేవి బంగ్లా'. లేటెస్ట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ వివాదాస్పదంగా మారింది. ఈ సినిమా టైటిల్‌ దగ్గర నుండే వివాదం రేగుతోంది. అయితే, శ్రీదేవి మరణానికి ముందే ఈ సినిమా టైటిల్‌ ఫిక్స్‌ చేశారనీ చిత్ర యూనిట్‌ చెబుతోంది. అయితే, ట్రైలర్‌లో హీరోయిన్‌ బాత్‌ టబ్‌లో పడి ఉన్న సీన్‌ని చూపించారు.

 

ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ చిత్ర నిర్మాతలకు లీగల్‌ నోటీసులు పంపారు. తన భార్య శ్రీదేవి మరణాన్ని సినిమాలో చూపించి క్యాష్‌ చేసుకోవాలనుకుంటున్నారనీ ఆయన ఆరోపించారు. దాంతో 'శ్రీదేవి బంగ్లా' ఇంకోసారి చిక్కుల్లో పడింది. ఈ సినిమాలో హీరోయిన్‌ రియల్‌ లైఫ్‌ పాత్రలో నటిస్తోంది. సినిమాలో క్యారెక్టర్‌ కూడా హీరోయిన్‌ క్యారెక్టరే కావడం శ్రీదేవి లైఫ్‌కి దగ్గరగా ఉండడం, ట్రైలర్‌ చివర్లో బాత్‌ టబ్‌ని చూపించడం.. ఇదంతా చూస్తుంటే, శ్రీదేవి బయోపిక్‌లాగానే అనిపిస్తోంది.

 

ఒకవేళ బయోపిక్‌ కాకున్నా, ఆమె మరణాన్ని ఈ సినిమా కోసం ఎంతో కొంత వాడుకున్నారనే అనిపిస్తోంది. ఈ సినిమాలో నటుడు, నిర్మాత ఆర్భాజ్‌ఖాన్‌ గెస్ట్‌ రోల్‌లో నటిస్తున్నాడు. శ్రీదేవి మరణానికీ, ఈ సినిమాలో హీరోయిన్‌ క్యారెక్టర్‌కీ ఏ సంబంధం లేదనీ, అది నిరూపించుకున్నాకనే ఈ సినిమాలో నటించేందుకు తాను ఒప్పుకున్నాననీ ఆయన తాజాగా తెలిపారు. గతంలోనూ ప్రియా ఈ వివాదంపై ఇదే విధంగా స్పందించారు. మొత్తానికి ప్రియా ప్రకాష్‌ వారియర్‌ మరోసారి బాలీవుడ్‌లో తొలి సినిమాతో సెన్సేషన్‌ అయ్యేలా కనిపిస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS