అన్నయ్య కీరవాణి కొడుకులు శ్రీ సింహా, కాల భైరవలు డెబ్యూ చేసిన సినిమా 'మత్త వదలరా'ని జక్కన్న తనదైన శైలిలో బాగానే ప్రమోట్ చేశాడు. సినిమా రిలీజయ్యాక కూడా ప్రమోషన్స్ని ఆపలేదు రాజమౌళి. తన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ 'ఆర్ఆర్ఆర్'ని పక్కన పెట్టేసి మరీ ఈ సినిమా ప్రమోట్ చేస్తున్నాడు. ఏదో రాజమౌళి దయ వల్ల ఆ సినిమా జనాల నోళ్లలో బాగానే నానింది. థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో, బాగానే ఎట్రాక్ట్ చేసింది కూడా. సో పెట్టిన బడ్జెట్కి సినిమా పైసా వసూల్ అనిపించుకున్నట్లే. జక్కన్న చేయి పడడంతో కీరవాణి కొడుకులు గట్టెక్కేసినట్లే అంటూ అంతా అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా, తన సినిమా సంగతుల్ని కూడా గుర్తు చేస్తున్నాడు రాజమౌళి. ఇదే సందు అదే సందు అంటూ, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్లపై జనంలో ఓ క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. ఆ క్రమంలో ఎప్పటి నుండో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'మహా భారతం' గురించి ఓ ఆణిముత్యం వదలాడు రాజమౌళి. నిజానికి 'బాహుబలి' తర్వాత జక్కన్న తీయబోయే బిగ్ ప్రాజెక్ట్ 'మహా భారతం' అనుకున్నారంతా. కానీ, 'ఆర్ఆర్ఆర్' టేకప్ చేశాడు. వరుసగా స్టార్ హీరోలతోనే సినిమాలు తెరకెక్కిస్తున్న రాజమౌళి బహుశా తన తదుపరి భారీ ప్రాజెక్ట్ 'మహాభారతం' అయ్యి ఉంటుందేమో కూడా.
ఇక్కడ గమనించాల్సిందేమంటే 'మహా భారతం' అంటే అనంతమైన కథ. నిజానికి మన తెలుగు సినిమాలన్నింటికీ అదే ప్రామాణికం. అలాంటిది మహాభారతం మొత్తానికి దృశ్య రూపం ఇవ్వడమంటే కత్తి మీద సామే. కానీ, రిస్క్ అంటే రాజమౌళి, రాజమౌళి అంటే రిస్క్. సో ఎంత రిస్క్ అయినా చేసి, మహా భారతం మొత్తం తెరకెక్కించి చూపిస్తా అంటున్నాడు రాజమౌళి. దటీజ్ రాజమౌళి. అంతేగా అంతేగా.