మరో వివాదంలో రామ్ గోపాల్ వర్మ 'ఆఫీసర్'..!

మరిన్ని వార్తలు

రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ఆఫీసర్‌'. నాగార్జున, వర్మ కాంబినేషన్‌లో దాదాపు 28 ఏళ్ల తర్వాత తెరకెక్కిన చిత్రమిది. ఈ నెల 25న రావాల్సిన ఈ చిత్రం జూన్‌ 1కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా స్టోరీ గురించి చెబుతూ వర్మ అభిమానులతో కొన్ని విషయాలు పంచుకున్నారు. 

యదార్ధ గాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది అని వర్మ చెబుతున్నారు. కర్ణాటక పోలీసాఫీసర్‌ కె.ఎమ్‌ ప్రసన్న జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని వర్మ చెబుతున్నారు. అయితే ఆయన జీవితంలో జరిగిన ఓ సంఘటనను ఆధారంగా చేసుకుని మాత్రమే ఈ చిత్రం రూపొందింది. అంతేకానీ, ఆయన బయోపిక్‌ అయితే కాదట. ఇదంతా బాగానే ఉంది. 

కానీ ఈ స్టోరీ కాపీ చేశారంటూ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జయ్‌ కుమార్‌ ఆరోపిస్తున్నారు. గతంలో వర్మ 'జీఎస్‌టీ' కాన్సెప్ట్‌ కూడా అలాగే కాపీ కొట్టారనీ ఆరోపిస్తూ ఆయన మీడియాకెక్కిన సంగతి తెలిసిందే. ఆయనే ఇప్పుడు 'ఆఫీసర్‌' స్టోరీ కూడా తనదేనంటూ మీడియా ముందుకొచ్చారు. దాంతో ఈ సినిమాకి మరో వివాదం తోడైంది. 

ఇప్పటికే ఓ నిర్మాణ సంస్థకు వర్మ బాకీ ఉన్నాడంటూ, ఆ బాకీ తీర్చేదాకా సినిమా విడుదల కానివ్వమంటూ సదరు నిర్మాణ సంస్థ కోర్టుకెక్కగా, తాజాగా జయ్‌ కుమార్‌ వివాదం ఒకటి 'ఆఫీసర్‌'కి తలనొప్పిగా మారింది. ఈ తలనొప్పుల బారి నుండి వర్మ - నాగ్‌ 'ఆఫీసర్‌' ఎలా బయట పడుతుందో. జూన్‌ 1కి అయినా ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS