ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన పరిస్థితి క్లిష్టతరంగా ఉందని ఇటీవల వార్తలొచ్చాయి. వీటిపై సుద్దాల స్పందించారు. తనకు ఆరోగ్యం బాగానే ఉందని, తనపై వచ్చిన వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఆమధ్య సుద్దాల అశోక్ తేజ అస్వస్థతకు గురైన మాట నిజమే. కానీ ఓ కు కీలకమైన ఆపరేషన్ తో ఆయన కోలుకున్నారు. ఇప్పుడాయన ఆరోగ్యంగానే ఉన్నారు. ''
ఇది వరకు నాకు ఆపరేషన్ జరిగింది. అయితే.. ఆ తరవాత నేను కోలుకున్నా. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా. పాటలు కూడా రాస్తున్నా. నా అభిమానులు, శ్రేయోభిలాషుల దీవెనల వల్ల ఆరోగ్యవంతుడ్ని అయ్యాను. నాపై వచ్చిన వార్తల్ని నమ్మకండి'' అని ఓ వీడియో ద్వారా ఆయన అభిమానులకు సందేశాన్ని పంపారు. పల్లెపదాన్ని తెలుగు పాటలో సమర్థవంతంగా వాడి, జనాల నీరాజనాలు అందుకున్న గీత రచయిత సుద్దాల. ఠాగూర్లోని నేను సైతం పాటకు ఆయనకు జాతీయ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. శ్రీశ్రీ తరవాత జాతీయ స్థాయిలో తెలుగు పాటకు పురస్కారం సంపాదించి పెట్టింది సుద్దాలనే.