మౌనమే సమాధానం అంటున్న సుక్కు?

మరిన్ని వార్తలు

దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఒకవైపు అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' మరోవైపు సుకుమార్ 'రంగస్థలం' విజయాలతో సూపర్ ఫామ్ లో ఉండడంతో 'పుష్ప' సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాపై ఈ మధ్య కథాచౌర్యం ఆరోపణలు వెల్లువెత్తడం చర్చనీయాంశంగా మారింది. వేంపల్లి గంగాధర్ అనే ఒక రచయిత తన కథను కాపీ కొట్టి 'పుష్ప' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని పరోక్షంగా విమర్శిస్తూ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేయడం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.

 

ఈ ఆరోపణలపై మిశ్రమస్పందన వ్యక్తం అవుతోంది. కొందరేమో ఆ రచయిత ఆరోపణలను నమ్ముతూ అతనికి మద్దతు ప్రకటిస్తున్నారు, కొందరు మాత్రం సుకుమార్ టీమ్ కు మద్దతిస్తున్నారు. అయితే ఈ వివాదం పై ఇంతవరకూ దర్శకుడు సుకుమార్ స్పందించలేదు. ఇన్సైడ్ టాక్ ఏంటంటే ఈ వివాదంపై స్పందించాల్సిన అవసరం లేదని దర్శకుడు సుకుమార్ అభిప్రాయపడుతున్నారట. వేంపల్లి గంగాధర్ రాసిన పుస్తకాలను తాను చదివానని, తన సినిమాకు ఆ కథలకు ఎటువంటి సంబంధం లేదని సుకుమార్ తన సన్నిహితులతో అంటున్నారట. కడప, చిత్తూరు జిల్లాల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ అంశం తప్ప మరే ఇతర విషయంలోనూ పోలిక ఉండదని అంటున్నారు.

 

ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులే ఆ విషయం అర్థం చేసుకుంటారని ఇప్పుడు ఈ అంశంపై స్పందించి వివాదాన్ని పెద్దది చేయడం అవసరం లేదని ఆయన భావిస్తున్నారట. మరోవైపు సుకుమార్ అభిమానులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది పబ్లిక్ డొమైన్లో ఉన్న అంశమని, దానిపై ఇప్పటికే మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయని, ఆ ఒక్క అంశం మాత్రమే ఆధారంగా చేసుకుని 'పుష్ప' సినిమా కాపీ అని ఆరోపణలు చేయడం సరికాదని అంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS