హీరోగా నిలదొక్కుకోవడానికి తనకు తోచిన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అక్కినేని మేనల్లుడు సుమంత్. 'మళ్లీ రావా' సినిమాతో కూల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. 'ఎన్టీఆర్' బయోపిక్తో ఈ ఏడాది ప్రేక్షకుల మనసుల్ని దోచేశాడు. అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో తనదైన నటన కనబరిచి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. మళ్లీ ఇప్పుడే తన కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు.
'పడయోట్టం' అనే ఓ మలయాళ రీమేక్లో నటించేందుకు సుమంత్ సైన్ చేశాడు. విను యజ్ఞ ఈ సినిమాకి దర్శకుడు. ఐమా అనే కొత్తమ్మాయి ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. కథా కమామిషు, ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. హీరోగా అవకాశాలు తగ్గిన కారణంగా ఒకానొక టైమ్లో సుమంత్ సినిమాలకు బ్రేకప్ చెప్పేయాలనుకున్నాడు. నిర్మాతగా తెర వెనక వ్యవహారం నడిపించాలనుకున్నాడు. కానీ, 'మళ్లీ రావా' సినిమాతో హిట్ వచ్చి తన ఖాతాలో చేరేసరికి మళ్లీ కెరీర్ని గాడిన పెట్టాడు. చూడాలి మరి ఈ సినిమా సుమంత్కి కలిసొస్తుందేమో.