వరల్డ్‌ కప్‌పై మహేష్‌ 'సూపర్‌' సెటైర్‌!

మరిన్ని వార్తలు

2019 వరల్డ్‌ కప్‌ విజేతగా ఇంగ్లాండ్‌ నిలవడంపై హర్షం వ్యక్తం చేశాడు సూపర్‌ స్టార్‌ మహేష్‌. థ్రిల్లింగ్‌ ఫైనల్‌ని తాను బాగా ఎంజాయ్‌ చేశానని అన్నాడు. గెలిచిన ఇంగ్లాండ్‌కి అభినందనలు తెలుపుతూనే, ఓడిన న్యూజిలాండ్‌ని ప్రత్యేకంగా అభినందించాడు మహేష్‌. దాంతో, చాలామంది మహేష్‌, ఇంగ్లాండ్‌ జట్టు మీద సెటైర్లు వేశాడంటూ సోషల్‌ మీడియా వేదికగా సందడి చేస్తున్నారు. ఇందులో మహేష్‌ అభిమానులే ఎక్కువ.

 

'ఇంగ్లాండ్‌ తొండి గేమ్‌ ఆడింది.. ఆ టీమ్‌కి అసలు అభినందనలే అనవసరం..' అని మెజార్టీ అభిమానులు మహేష్‌ ట్వీట్‌ని ట్యాగ్‌ చేస్తుండడం గమనార్హం. టీమిండియా, ఫైనల్‌కి వెళ్ళకపోవడానికి న్యూజిలాండ్‌ కారణమే అయినా, ఆ జట్టు పట్ల భారత క్రికెట్‌ అభిమానులు ప్రత్యేకమైన అభిమానం ప్రదర్శిస్తున్నారు. నిజానికి, ఇంగ్లాండ్‌కి అంపైర్ల తప్పిదం కారణంగా అదనపు పరుగు లభించి వుండకపోతే, వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ గెలిచి వుండేదే. ఆ విషయాన్ని మహేష్‌ ప్రస్తావించకపోయినా, మహేష్‌ అభిమానులు మాత్రం ప్రస్తావిస్తున్నారు.

 

నిజానికి మహేష్‌ తన ట్వీట్‌లో ఎక్కడా ఇంగ్లాండ్‌ని తగ్గించి మాట్లాడలేదు. జస్ట్‌ ఆటని ఆటలా తాను ఎంజాయ్‌ చేసిన వైనం గురించి మాత్రమే ప్రస్తావించాడు. అది అభిమానులకి ఇంకోలా అర్థమయ్యింది. దాన్ని అభిమానులు రకరకాలుగా విశ్లేషించుకుంటున్నారు. అద్గదీ అసలు సంగతి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS