కమెడియన్ కు లీగల్ నోటీస్ పంపిన స్వామి 'నిత్యానంద'.

By Madhukishore - August 28, 2019 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

స్వామి నిత్యానంద పేరు వినగానే గతంలో ఆయన చేసిన రాస లీలలే గుర్తుకు వస్తాయి.. ఈ కాంట్రవర్సియల్ స్వామిజి, నటి రంజిత కేసు విషయం లో దాదాపు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ స్వామి మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. దానికి కారణం ఒక కమెడియన్ కు లీగల్ నోటీసులు పంపడం. తక్కువ సమయం లోనే టాప్ హీరోల పక్కన నటించే అవకాశాలు దక్కించుకుని, తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నాడు 'యోగి బాబు'.

 

ఆ క్రేజ్ వల్లే విజయ్ నటించిన మెర్సల్, సర్కార్ మరియు అజిత్ నటించిన విశ్వాసం చిత్రాల్లో కనిపించాడు. అంతే కాదు ధర్మ ప్రభు, గుర్కా వంటి చిత్రాలతో ఆల్ మోస్ట్ హీరో క్యారెక్టర్లు కూడా చేస్తున్నాడు. యోగి బాబు మరియు వరుణ్ నటిస్తున్న చిత్రం 'పప్పి' మోషన్ పోస్టర్ నిన్న విడుదలైంది. ఈ చిత్రం కారణంగానే స్వామి నిత్యానంద యోగి బాబు మరియు 'పప్పి' టీం కు లీగల్ నోటీసులు పంపాడు.

 

ఈ పోస్టర్ లో 'వరుణ్' ప్రముఖ పోర్న్ స్టార్ 'జానీ సిన్స్' రూపం లో మరియు 'యోగి బాబు' స్వామి నిత్యానంద రూపం లో కనిపించారు.. దాంతో నిత్యానంద.. వీళ్లకు నోటీసులు పంపాల్సి వచ్చింది. ఏదేమైనా ఈ నోటీసులు 'పప్పి' టీం కు మాత్రం కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చిపెట్టింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS