స్వరూపానంద 'ఆమె' గురించి 'అలా' ఎందుకు చెప్పారో!

మరిన్ని వార్తలు

శారదా పీఠాధిపతి స్వరూపానంద అంటే సినీ, రాజకీయ ప్రముఖుల్లో విపరీతమైన నమ్మకం ఉంది. సాధారణ భక్తులకు ఆయన దర్శన భాగ్యం దక్కే అవకాశం చాలా తక్కువ. కానీ, సినీ, రాజకీయ దిగ్గజాలు ఆయన్ని తరచూ కలుస్తుంటారు. ఇది తెలిసిన విషయమే. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఓ జాతీయ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో స్వరూపానంద చేసిన వ్యాఖ్యలకు గాయని సునీత షాకయ్యారు. ఈ విషయమై సోషల్‌ మీడియా వేదికగా ఆమె కొంచెం ఘాటుగా స్పందించారు. ఇంతకీ అసలు విషయమేంటంటే, యాంకర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఆయన తన వద్దకు వచ్చిన భక్తుల లిస్టులో చిరంజీవి, రజనీకాంత్‌ వంటి ప్రముఖుల పేరుతో పాటు, గాయని సునీత పేరును కూడా ప్రస్థావించారు.

 

అలా ప్రత్యేకించి, ఆయన ఆమె పేరును ప్రస్థావించడం ఈ వివాదానికి కారణమైంది. క్యాజువల్‌గానే ఆయన సునీత పేరు ప్రస్థావించి ఉంటారు. కానీ, సునీత మాత్రం దాన్ని సీరియస్‌గా తీసుకున్నారెందుకో. తాను ఎప్పుడూ స్వరూపానందను కలవలేదనీ, ఎందుకు ఆయన నోటి వెంట తన పేరు వచ్చిందనీ, ఓ నేషనల్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ ఇతరుల పేరును స్వరూపానంద ఎలా ప్రస్థావిస్తారనీ.. సునీత ప్రశ్నిస్తోంది. సెలబ్రిటీల మీద పలు రకాల గాసిప్స్‌ వస్తుంటాయి. అయితే, కొన్నింటిని లైట్‌ తీసుకోవాలి. కొన్నింటి పట్ల తప్పక స్పందించాలి.. అంటూ స్వరూపానంద వ్యాఖ్యల్ని తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో పోస్ట్‌ చేసి, ఈ అంశంపై ఘాటుగా స్పందించారు ప్రముఖ సింగర్‌ సునీత. ఇక్కడ గమనించాల్సిందేమంటే, ఈ ఇష్యూని ఇంత పెద్దది చేయాల్సిన అవసరం లేదు. కానీ, గాయని సునీత ఎందుకు ఇలా స్పందించారో, ఆ స్పందన వెనక ఆంతర్యమేంటో ఆమెకే తెలియాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS