పెళ్ళికి సమయం కావాలి: శ్వేతా బసు ప్రసాద్

మరిన్ని వార్తలు

కొత్త బంగారు లోకం చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి అందరిని ఆకట్టుకుంది. అయితే తరువాత కాలంలో సినిమాలు తగ్గిపోవడం అదే సమయంలో ఒక అనుకోని సంఘటన జరగడంతో ఆమె పూర్తిగా సినిమాలకి దూరమయింది.

ఇక ఆ సంఘటన జరిగిన కొన్నిరోజుల తరువాత, దర్శకుడు అనురాగ్ కశ్యప్ సహకారంతో ఆయన వద్ద స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా పనిచేసింది. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే ఫిలిం మేకర్ రోహిత్ మిట్టల్ తో ప్రేమలో పడింది. ఇక వీరి ప్రేమ గురించి ఇరు కుటుంబాలకి తెలియచేయడం వారు కూడా సమ్మతించడం జరిగిందట. 

ఈ సమయంలోనే వీరి వివాహం త్వరలోనే జరగనుంది అన్న వార్తలు రావడం మొదలైంది. దీనితో ఈ అంశం పైన శ్వేతా స్పందిస్తూ- తాము ప్రేమలో ఉన్నది నిజమే, ఇరు కుటుంబాలు ఒప్పుకున్నది నిజమే అయితే తమ పెళ్ళికి మాత్రం ఇంకా సమయం ఉంది అని చెప్పింది.

శ్వేతా ఇచ్చిన వివరణతో ఈ అంశం పైన పూర్తి క్లారిటీ వచ్చింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS