శ్యామల కి తేజు-కౌశల్ ఓటు ఎందుకు వేయలేదో తెలుసా

మరిన్ని వార్తలు

నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్ కంటే చాలా భిన్నంగా, ఎమోషనల్ గా సాగింది. నిన్నటిరోజు ఎపిసోడనే కాదు మొన్నటిది కూడా కాస్త వాడి వేడిగానే జరిగింది అని చెప్పాలి.

ఇక ముఖ్యంగా నిన్నటి ఎలిమినేషన్ కి వచ్చేసరికి, డేంజర్ జోన్ లో ఉన్న చివరి ముగ్గురిలో (దీప్తి, నందిని & శ్యామల) ఇద్దరినీ.. కౌశల్ & తేజశ్విని లని తమ స్పెషల్ ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్ నుండి బయటకి తేవాలని బిగ్ బాస్ ఆదేశించారు.

ఆ సమయంలో అందరూ దీప్తి, శ్యామలని రక్షించి నందినిని ఎలిమినేట్ చేస్తారు అని భావించగా “ఏదైనా జరగోచ్చు” అన్న ట్యాగ్ లైన్ కి సరిపోయేలా నందినిని సేవ్ చేసి శ్యామల ని ఎలిమినేట్ చేశారు తేజ్ & కౌశల్. అయితే ఆ సమయంలో శ్యామలకి చిన్న బాబు ఉండటం వల్లనే తాము ఇలా చేసాము అని చెప్పినా ఇలా చేయడానికి మరొక బలమైన కారణం ఉంది అని చెప్పాలి.

అదేంటి అంటే రెండు వారల క్రితం చెరుకు రసం ఫ్యాక్టరీ టాస్క్ లో ఉత్తమ కెప్టెన్ గా కౌశల్, ఉత్తమ ప్రతిభ కనబరిచిన తేజస్విలకి ఈ స్పెషల్ ఓటింగ్ ని బిగ్ బాస్ ఇవ్వగా వారు ఆరోజు ఆ స్పెషల్ ఓటింగ్ ని తప్పనిసరి పరిస్థితులలో తమ ఎల్లో టీం సభ్యులు అయిన వారికే అది ఉపయోగిస్తాము అని మాట ఇచ్చారు. అందులో భాగంగానే తమ సభ్యులైన దీప్తి, నందినిలని కాపాడగలిగారు.

ఏదేమైనప్పటికి ఈ వారం ఎలిమినేషన్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది అనే చెప్పాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS