'సైరా' వసూళ్లు నిలకడగా సాగుతున్నాయి. 'బాహుబలి' రికార్డుల్ని బ్రేక్ చేయలేకపోయింది. కానీ, నిర్మాతలకు లాభాలే మిగిల్చింది 'సైరా'. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 102 కోట్లు షేర్ సాధించింది. రన్ టైం ముగిసే సరికి టోటల్గా 150 కోట్లు పైనే షేర్ సాధించే అవకాశముందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 'సైరా' తర్వాత రెండు వారాలు గడుస్తున్నా, చెప్పుకోదగ్గ సినిమాలేమీ విడుదల కాకపోవడంతో, వసూళ్ల పంట కొనసాగింది.
ఇప్పటికీ 'సైరా'కి తిరుగు లేదు. ఈ వారం కూడా పెద్దగా విడుదలయ్యే సినిమాలేం లేకపోవడంతో ఈ వీకెండ్ కూడా 'సైరా'కి పండగే. ఇదిలా ఉంటే, బాలీవుడ్లో 'సైరా'కి 'వార్' రూపంలో పెద్ద దెబ్బే పడింది. ఆ దెబ్బ ఇప్పుడు కవర్ అయ్యేలా ఉంది. అక్కడ ప్రస్తుతం 'వార్' హవా కాస్త తగ్గింది. దాంతో, 'సైరా' వసూళ్లు మళ్లీ పుంజుకుంటున్నాయట. ఈ వారం ఆ జోరు ఇంకా ఎక్కువగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే, 'సైరా'లో యాడ్ చేయాల్సిన రెండు పాటలను ఈ వారం యాడ్ చేస్తారని తెలుస్తోంది. రెండు పాటలతో పాటు, మరికొన్ని ఇంపార్టెంట్ సీన్స్ కూడా యాడ్ చేయనున్నాడనట.
దాంతో 'సైరా' ఈ వారం ఫుల్ డోస్లో జోరందుకోవడం ఖాయమంటున్నారు. ఇదిలా ఉంటే, రాజకీయ ప్రముఖుల్ని 'సైరా' చూడమని చిరంజీవి కోరడం, వారు సినిమా చూసి ప్రశంసించడం జరుగుతోంది. తెలంగాణ గవర్నర్ తమిళ సై ఆల్రెడీ సినిమాని వీక్షించారు. ఏపీ సీఎం జగన్ త్వరలో సినిమా చూస్తానని మాటిచ్చారు. ఇప్పుడు సెంట్రల్ స్థాయిలో నేతల్ని కూడా 'సైరా' చూడమని రిక్వెస్ట్ చేసేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు మెగాస్టార్ చిరంజీవి.