'సాహో' అనబోతున్న 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'!

మరిన్ని వార్తలు

ప్రబాస్‌ నటించిన 'సాహో' సినిమా ఆగస్టు 15న వరల్డ్‌ వైడ్‌గా విడుదల కానుంది. ఈ లోగా ఓ తాజా అప్‌డేట్‌ సర్య్యులేట్‌ అవుతోంది. అదే రోజు చిరంజీవి ప్రతిష్ఠాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' ట్రైలర్‌ విడుదల చేయనున్నారనీ తెలుస్తోంది. మొదట్లో చిరంజీవి పుట్టినరోజున అంటే ఆగస్ట్‌ 22న ట్రైలర్‌ విడుదల చేయాలనుకున్నారట. అయితే, మెగా ఫ్యాన్స్‌కి అంతకు ముందే కిక్‌ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కాస్త ముందుకు అనగా ఆగస్ట్‌ 15న విడుదల చేసే యోచన చేస్తున్నారట. కాన్సెప్ట్‌ పరంగా 'సైరా' తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధని బేస్‌ చేసుకుని తెరకెక్కుతోన్న చిత్రం.

 

ఈ సినిమాకి సంబంధించి బెస్ట్‌ అప్‌డేట్‌ ఇవ్వడానికి ఆ రోజు కన్నా మరే రోజు అంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సో అదే ఆలోచనతో ఇండిపెండెన్స్‌ డే నాడు 'సైరా' ట్రైలర్‌ వదలనున్నారనీ అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారమ్‌. ఒకవేళ ఇదే జరిగితే, ఈ ఏడాది ఇండిపెండెన్స్‌డేకి డబుల్‌ ధమాకా అని చెప్పాలి. 'సాహో', 'సైరా' రెండూ ప్రతిష్ఠాత్మక చిత్రాలే. భారీ బడ్జెట్‌ చిత్రాలే. జనంలో అత్యంత ఆశక్తి కలిగిన చిత్రాలు. అలాంటి ఈ రెండు చిత్రాలకు సంబంధించి ఇంత ముఖ్యమైన అప్‌డేట్స్‌ అంటే ఫ్యాన్స్‌కి అసలు సిసలు పండగ ఆ రోజే అని చెప్పక తప్పదు. చూడాలి మరి ఫ్యాన్స్‌కి ఆ డబుల్‌ ధమాకా అందేనో లేదో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS