చిరు ఇదే జోరులో..!

మరిన్ని వార్తలు

తొమ్మిదేళ్ల గ్యాప్‌ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి ముఖానికి రంగు వేసుకున్నారు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. 150 వ సినిమాగా తెరకెక్కిన 'ఖైదీ నెంబర్‌ 150'తో రికార్డులు బద్దలు కొట్టారు. ఇక ఇప్పుడు 'సైరా నరసింహారెడ్డి'తో సై సైరా.. చిరు అనిపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. మరో 10 రోజుల్లో 'సైరా' షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకోనుందట. తర్వాత విజువల్‌ ఎఫెక్ట్స్‌తో సైరా టీమ్‌ బిజీ కానుందట. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలోని విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం హాలీవుడ్‌ ప్రముఖుల్ని ఇండియాకి దిగుమతి చేశారు.

 

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఏమాత్రం ఖర్చుకు వెనుకాడకుండా రామ్‌చరణ్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మొదట్లో ఈ సినిమాని ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా ఆగస్ట్‌ 15 న విడుదల చేయాలనుకున్నారు. కానీ అప్పటికింకా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి కావనే నేపథ్యంలో అక్టోబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఓ గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో, రిలీజ్‌ డేట్‌కీ అంతే ప్రాముఖ్యత ఉండాలని సైరా యూనిట్‌ యోచిస్తోంది. అందుకే అక్టోబర్‌ 2 గాంధీ జయంతి సందర్భంగా సైరా విడుదల కానుందని తాజా సమాచారమ్‌.

 

నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో లేటెస్ట్‌గా జేజమ్మ అనుష్క కూడా యాడ్‌ అయిన సంగతి తెలిసిందే. కథకి కీలక పాత్రతో పాటు, ఓ సాంగ్‌లోనూ జేజమ్మ నటించనుందని ప్రచారం జరుగుతోంది. బిగ్‌బీ అమితాబ్‌ సహా, పలువురు ఇతర భాషా ప్రముఖ నటులు ఈ సినిమాలో భాగమవుతున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్‌ త్రివేది మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన టీజర్‌ ప్రభంజనం సృష్టిస్తే, మరో టీజర్‌ సంచలనాలకు త్వరలోనే ముహూర్తం ఫిక్స్‌ చేయనున్నారు సైరా టీమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS