సొట్ట బుగ్గల సిన్నది తాప్సీ గ్లామర్ డాళ్గా టాలీవుడ్కి సుపరిచితురాలైనా, ప్రస్తుతం బాలీవుడ్ని ఏలుతోన్న స్టార్ హీరోయిన్స్లో ఒకరుగా చెలామనీ అవుతోంది. వరుసగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా ఉంటూ, సత్తా చాటుతోంది. అయితే, వీలు చిక్కినప్పుడల్లా వివాదాల్లో చిక్కుకోవడాన్ని కూడా ఎంజాయ్ చేస్తుండే తాప్సీ, తాజాగా బాలీవుడ్లో నెపోటిజమ్ (బంధుప్రీతి) చాలా ఎక్కువ అంటూ వ్యాఖ్యానించింది. ఆ కారణంగా తాను చాలా అవకాశాలు మిస్ చేసుకోవల్సి వచ్చిందంటూ సంచన వ్యాఖ్యలు చేసింది. అయితే, ఇదే మాటపై గతంలో మరో బ్యూటీ కంగనా రనౌత్ కూడా పెద్ద రచ్చే చేసింది.
స్టార్ వారసురాళ్లు తమకు రావల్సిన అవకాశాల్ని తన్నుకెళ్లిపోతున్నారనేది.. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ముక్త కంఠం తో చెబుతున్న మాట. అయితే, ఇక్కడ గమనించాల్సిందేమంటే, బాలీవుడ్లో తాప్సీకీ, కంగనా రనౌత్కీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందన్న సంగతి తెలిసిందే. గతంలో పలు మార్లు వీరి మధ్య మాటల యుద్దాలు తలెతాయి . కానీ, సోలోగా కష్టపడి పైకొచ్చి, స్వతహాగా స్టార్డమ్ దక్కించుకున్న తారలు కాబట్టి, ఆ మాత్రం ఈగో ఉండడంలో తప్పేం లేదులెండి. ఇదిలా ఉంటే, రీసెంట్గా ‘తప్పడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది తాప్సీ. సక్సెస్ టాక్తో ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. మరోవైపు కంగనా తమిళంలో ‘తలైవి’ చిత్రంతో బిజీగా వుంది.