సెంటిమెంట్‌తో తాప్సీ గేమ్స్‌.!

మరిన్ని వార్తలు

'ఝుమ్మందినాదం' సినిమాతో క్యూట్‌ గాళ్‌గా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తాప్సీ గ్లామర్‌ డాళ్‌గానే అందరికీ సుపరిచితురాలైంది. కానీ ఆమెలో సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ టాలెంట్‌ ఉందన్న సంగతి బాలీవుడ్‌కెళ్లాకే అందరికీ అర్ధమైంది. ఆమెలోని నటిని ఛాలెంజ్‌ చేసే పలు పాత్రలు పోషించే అవకాశం బాలీవుడ్‌లో దక్కింది. దాంతో బాలీవుడ్‌కెళ్లాక తాప్సీ కాస్త నోటి దురుసు ప్రదర్శించింది. 

టాలీవుడ్‌ పైనా, టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుల పైనా విమర్శలు గుప్పించడం మొదలు పెట్టింది. ఆ రకంగా తాప్సీ వార్తల్లో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. కాగా ప్రస్తుతం బాలీవుడ్‌లో 'మన్‌మర్జియాన్‌' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది తాప్సీ. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ని కొత్తగా ప్లాన్‌ చేసింది. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాల్లో భాగంగా ఈ సినిమాలో పంజాబీ సంస్కృతిని కించపరిచేలా కొన్ని సీన్లు ఉన్నాయని వస్తున్న విమర్శల్ని తన సినిమా ప్రమోషన్స్‌కి బాగా వాడేసుకుంటోంది. 

ఎలాగంటారా? ఈ విమర్శలతో సోషల్‌ మీడియాలో తాప్సీపై ట్రోలింగ్‌ మొదలెట్టారు నెటిజన్లు. వాటిని తనకు అనుకూలంగా మార్చేసుకుని నెటిజన్స్‌తో పోటీపడి మరి ఎదురు ట్రోలింగ్‌ చేస్తోంది తాప్సీ. ఎంతటి విమర్శలనైనా చలించకుండా, విసుగు చెందకుండా ఎదుర్కొంటోంది. ఏది ఏమైనా బాలీవుడ్‌కెళ్లాక తాప్సీలో కాన్ఫిడెన్స్‌, ధైర్యం పెరిగిపోయాయి. 

తెలుగులో ఈ మధ్య తాప్సీ 'నీవెవరో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కింది ఈ చిత్రం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS