'ఎన్టీఆర్‌'కి గ్లామర్‌ అద్దనున్న మిల్కీబ్యూటీ.!

మరిన్ని వార్తలు

ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఎన్టీఆర్‌' బయోపిక్‌కి మరో గ్లామర్‌ యాడ్‌ కానుందట. మిల్కీబ్యూటీ తమన్నాని ఈ సినిమాలో ఓ పాత్ర కోసం సంప్రదించినట్లుగా తెలుస్తోంది. 

ఏ పాత్ర కోసమంటారా? అలనాటి అందాల తార జయప్రద పాత్రనీ తెలుస్తోంది. ఎన్టీఆర్‌ - జయప్రద కాంబినేషన్‌లో ఎన్నో సూపర్‌ డూపర్‌ హిట్స్‌ ఉన్నాయి. అయితే ఈ సినిమాలో తమన్నాని జస్ట్‌ ఓ పాట కోసమే తీసుకుంటున్నారనీ తెలియవస్తోంది. అది కూడా 'అడవి రాముడు' సినిమాలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను..' ఆ పాట కోసం దర్శకుడు క్రిష్‌ తమన్నాని సెలెక్ట్‌ చేశారనీ తాజా విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. 

ఆల్రెడీ రకుల్‌ - బాలయ్యలపై 'ఆకు చాటు పిందె తడిసె..' సాంగ్‌ని చిత్రీకరించారు. బయటికొచ్చిన ఈ సాంగ్‌ స్టిల్స్‌ అదరగొట్టేస్తున్నాయి. తాజాగా ప్రచారమవుతున్న జయప్రద పాత్రలో తమన్నా.. గాసిప్‌లో నిజమెంతుందో తెలీదు కానీ, ఒకవేళ నిజమైతే 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ అంతా సూపర్‌ డూపర్‌ గ్లామర్‌ హిట్‌ అని ముందే చెప్పక తప్పట్లేదు. 

ఇకపోతే ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పైన చెప్పుకున్న గ్లామర్‌ అంతా ఎన్టీఆర్‌ సినీ ప్రస్థానంగా రూపొందుతున్న 'కథానాయకుడు' పార్ట్‌లోనే కనిపించనుంది. రెండో భాగాన్ని ఎన్టీఆర్‌ రాజకీయ ప్రస్థానంగా 'మహానాయకుడు' టైటిల్‌తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతవరకూ నటుడిగా సత్తా చాటిన బాలయ్య ఈ సినిమాతో తొలిసారి నిర్మాతగానూ మారుతుండడం విశేషం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS