స్పెషల్ సాంగ్స్ కోసం ఇప్పుడు హీరోయిన్స్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. శ్రియ, ఛార్మి, తమన్నా, కాజల్, లేటెస్టుగా పూజా హెగ్దే ఇలా పలువురు స్టార్ హీరోయిన్లే ఈ స్పెషల్ సాంగ్స్ కోసం పోటీ పడ్డవారిలో ముందుండడం విశేషం. ఏదో కెరీర్ క్లోజ్ అయిపోయి, అవకాశాల్లేక ఐటెం సాంగ్స్ ఎంచుకోవడం కాదండోయ్. ఈ స్పెషల్ సాంగ్స్కి ఫుల్ క్రేజ్. హై రేంజ్ రెమ్యునరేషన్. ఒక్క దెబ్బకే రెండు పిట్టలన్నమాట.
అయితే ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో, స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్కి స్పెషల్ క్రేజ్ ఉంది కదా. లేటెస్టుగా పూజా హెగ్దే 'రంగస్థలం'లో 'జిగేల్ రాణీ..' అంటూ చరణ్ పక్కన చిందేసి ఎలాంటి క్రెడిట్ కొట్టేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన చిందేసి క్రేజ్ కొట్టేయబోయే ఆ ముద్దుగుమ్మ ఎవరనే దానిపైనే టాలీవుడ్లో చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రంలో స్పెషల్ సాంగ్ని విభిన్నంగా చిత్రీకరించనున్నారట.
ఈ సాంగ్లో ఇద్దరు స్టార్ హీరోయిన్లతో స్పెషల్ సాంగ్ని ప్లాన్ చేస్తున్నారనీ తెలుస్తోంది. అయితే ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎవరంటే, మిల్కీబ్యూటీ తమన్నా, చందమామ బ్యూటీ కాజల్ అంటూ గాసిప్స్ వినవస్తున్నాయి. ఆల్రెడీ 'పక్కా లోకల్..' అంటూ స్పెషల్ సాంగ్లో మాస్ స్పెప్పులిరగదీసేసింది కాజల్ అగర్వాల్. ఇకపోతే ఇప్పుడు ఓ పక్క మిల్కీ బ్యూటీ, మరో పక్క చందమామ ఇద్దరితోనూ ఎన్టీఆర్ చిందేయబోతున్నాడనే గాసిప్ బాగా ప్రచారంలో ఉంది.
ఒకవేళ ఇది నిజమైతే నిజంగా విశేషమే. ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఓ స్పెషల్ సాంగ్ కోసం పోటీ పడడమన్న మాట.