'సవ్యసాచి'ని మిస్సయిన తమన్నా, ఎందుంటే.!

మరిన్ని వార్తలు

నాగచైతన్య తాజా చిత్రం 'సవ్యసాచి'లో 'నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయతూ..' అనే పాట రీమిక్స్‌ చేసిన సంగతి తెలిసిందే. లేటెస్టుగా ఈ సాంగ్‌ ప్రోమో వీడియోని కూడా బయటికి వదిలేశారు. ఆ ప్రోమో సాంగ్‌కి బెస్ట్‌ రెస్పాన్స్‌ వచ్చేస్తోంది. నిధి అగర్వాల్‌ అందాలు, డాన్సింగ్‌ తళుకులు కుర్రోళ్లని మత్తెక్కించేస్తున్న మాట వాస్తవమే. 

అయితే ఈ పాటలో ముందు మిల్కీ బ్యూటీ తమన్నాని ఎంచుకుందామనుకున్నారట. జోరుగా ఆ వార్త ప్రచారమైంది కూడా. అయితే సాంగ్‌ ప్రోమో బయటికొచ్చాక తెలిసింది. అరే ఈ పాటలో తమన్నా అన్నారు కదా.. హీరోయిన్‌తోనే స్టెప్పులేయించేశారేంటీ.? అని కొంతమంది డౌట్‌ ఎక్స్‌ప్రెస్‌ చేశారు. ఈ డౌట్‌ని చిత్ర నిర్మాతలు క్లియర్‌ చేసేశారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సాంగ్‌ ఇది. సడెన్‌గా తమన్నాని సీనులోకి తీసుకొస్తే కన్విన్సింగ్‌గా ఉండదని భావించి హీరోయిన్‌తోనే సాంగ్‌ చిత్రీకరించేశారట. 

ఏదేమైనా సాంగ్‌ అయితే అదిరిపోయింది. అది వేరే విషయం. ఇకపోతే అసలు విషయానికి వస్తే, డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌గా కనిపిస్తున్న 'సవ్యసాచి'లో ఉన్నవి రెండే రెండు యాక్షన్‌ సీన్స్‌ అట. అయితే ఇంతవరకూ ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌ మీద ఇలాంటి కమర్షియల్‌ యాక్షన్‌ ఘట్టాలను చూసి ఉండమట. ఆ స్థాయిలో ఈ యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరించారట. 

విలన్‌గా మాధవన్‌నే ఎందుకు ఎంచుకున్నారో స్పెషల్‌ రీజన్‌ ఉందట. ఆ రీజన్‌ ఏంటో ప్రస్తుతానికి సస్పెన్స్‌. కానీ సినిమా చూస్తే అందరికీ సింపుల్‌గా అర్ధమవుతుంది. సినిమాకి ఆయన పాత్ర ఎంత కీలకమో, హీరో, విలన్‌ మధ్య వచ్చే సీన్స్‌ ఆడియన్స్‌కి కిర్రాక్‌ పుట్టిస్తాయట. సినిమాలో ఇన్ని ప్లస్‌ పాయింట్స్‌ ఉన్నాయంటే అస్సలు ఆగలేకపోతున్నారు కదా. కానీ తప్పదు నవంబర్‌ 2 వరకూ ఆగాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS