మెగా ఫ్యామిలీ అంటే తమన్నాకు విపరీతమైన అభిమానం. తమన్నాని చిరు కుటంబం కూడా బాగా ప్రోత్సహిస్తుంటుంది. పవన్, బన్నీ, చరణ్.. వీళ్లందరితోనూ కలిసి నటించింది తమన్నా. సైరాలో చిరంజీవితోనూ జోడీ కట్టింది. ఇప్పుడు మరోసారి తమన్నాకు మెగా ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో `ఆచార్య` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ కథానాయిక. రెజీనా ఓ ప్రత్యేక గీతంలో నటించనుంది. అయితే తమన్నాకి కూడా ఓ పాట దక్కిందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో కీలకమైన చోట.. ఓ ప్రత్యేక గీతం అవసరమైందని, ఆ పాటలో తమన్నా నర్తించనున్నదని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే.. ఇప్పటికి ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలున్నట్టు. అయినా సరిపోవడం లేదు. చరణ్ పక్కన జోడీని ఇంకా ఖరారు చేయాల్సివుంది. చరణ్ తో కైరా అద్వాణీ జోడీ కట్టబోతోందని మరో టాక్ వినిపిస్తోంది. ఆ స్థానం కూడా ఖాయమైపోతే ఆచార్యలో నలుగురు హీరోయిన్లు ఉన్నట్టు లెక్క.