తమన్నాకి రెమ్యునరేషన్ ఫిక్స్ చేసేశారు

మరిన్ని వార్తలు

మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా ఎంత పెద్ద క్రేజ్ ఉందొ స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్ గా అంతే క్రేజ్ ఉంది. ఇక ఆమె తాజాగా అక్కినేని నాగ చైతన్య సవ్యసాచి చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ లో నర్తించనుందట.

ఇంతకి ఆ పాట మరేదో కాదు, నాగార్జున-రమ్యకృష్ణ ల మధ్య వచ్చిన “నిన్ను రోడ్డు మీద చూసినాది” పాట. అల్లరి అల్లుడు చిత్రంలోని ఈ పాటని ఇప్పుడు సవ్యసాచిలో రీమేక్ చేస్తున్నారట. ఇక ఇందుకోసం ఎంపిక చేసిన తమన్నాకి అక్షరాల రూ 60 లక్షల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్టుగా సమాచారం.

త్వరలోనే ఈ పాటని చిత్రీకరిస్తారు అన్న సమాచారం ఉంది, అయితే షూటింగ్ తేదీలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇకపోతే, చైతు ఈ చిత్రం సవ్యసాచి పైన చాలా అంచనాలే పెట్టుకున్నట్టుగా అర్ధమవుతుంది, సోలోగా ఒక మంచి కమర్షియల్ హిట్ కోసం చాలా రోజులనుండే బాక్స్ ఆఫీస్ పైన దండయాత్ర చేస్తున్నాడు ఈ అక్కినేని వారసుడు.

చూద్దాం.. ఈ పాట సవ్యసాచి విజయానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో ..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS