చరణ్‌తో 'రచ్చ' చేస్తానంటోన్న మిల్కీ బ్యూటీ?

మరిన్ని వార్తలు

చరణ్‌ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకి ఐటెం సాంగ్‌ కోసం తమన్నాని ఎంచుకున్నారనీ సమాచారమ్‌. చరణ్‌ - సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రంగస్థలం'లో హాట్‌ బ్యూటీ పూజా హెగ్దే స్పెషల్‌ సాంగ్‌లో చిందేసింది. ఈ సారి ఆ ఛాన్స్‌ తమన్నా కొట్టేసిందట. 'రచ్చ' సినిమాలో తమన్నా, చరణ్‌ ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ అదిరిపోయింది. 

డాన్సుల్లో తమన్నా, చరణ్‌ ఇద్దరూ ఇద్దరే. అందుకే ఈ సినిమాలో చిరంజీవి సూపర్‌ హిట్‌ సాంగ్‌ అయిన 'వాన వాన..' పాటని రీమిక్స్‌ చేశారు. ఈ పాటలో ఇద్దరూ చెలరేగిపోయి డాన్సులేసేశారు. ఇప్పుడు మళ్లీ చరణ్‌, తమన్నా స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారనీ తెలియవస్తోంది. చరణ్‌ తాజా సినిమాలో ఐటెం సాంగ్‌ కోసం బోయపాటి, తమన్నాని సంప్రదించాడట. ఆ సాంగ్‌లో నటించేందుకు తమన్నా ఒప్పుకుందనీ సమాచారమ్‌. 'రంగస్థలం'లో పూజాతో 'ఓ ముద్దు పెట్టవే జిగేల్‌ రాణీ..' అంటూ లుంగీ ఎగ్గట్టి చిందేసిన రామ్‌చరణ్‌ ఇప్పుడు మిల్కీబ్యూటీ తమన్నాతో చిందేయడానికి సిద్ధమవుతున్నాడన్నమాట. 

ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది. అయితే తమన్నా ఐటెం సాంగ్‌ విషయాన్ని చిత్ర యూనిట్‌ ఇంకా అఫీషియల్‌గా డిక్లర్‌ చేయలేదు. ఇకపోతే తమన్నా ప్రస్తుతం బాలీవుడ్‌ 'క్వీన్‌' తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. ఈ సినిమాని అదే టైటిల్‌తో తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఇది కాక నందమూరి హీరో కళ్యాణ్‌రామ్‌తో 'నా నువ్వే' చిత్రంలోనూ తమన్నా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS