పవన్ ట్వీట్.. స్పందించిన తమిళనాడు ప్రభుత్వం

మరిన్ని వార్తలు

చేతిలో అధికారం ఉన్నా లేకున్నా, తాను గెలిచినా గెలవకున్నా.. పవన్ కల్యాణ్ ఓ సమస్యపై పోరాటం మొదలెట్టాడంటే, దానిపై విజయం సాధించినట్టే. ఈ విషయం చాలా సందర్భాల్లో నిజం అయ్యింది. ఇప్పుడు మరోసారి పవన్ కేవలం ఒకే ఒక్క ట్వీటుతో ఓ సమస్యకి పరిష్కారం చూపించగలిగాడు. అదీ... తమిళనాట.

 

వివరాల్లోకి వెళ్తే... శ్రీకాకుళంకి చెందిన కొందరు మత్యకారులు చెన్నై పోర్టులో చిక్కుకుపోయారు. లాక్ డౌన్ వల్ల.. అక్కడి నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఆహార పానియాలు లేక రోజుల తరబడి ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం పవన్ కల్యాణ్ కి చేరింది. చెన్నైలోని పోర్టులో చిక్కుకుపోయిన మత్యకారులకు సహాయం చేయాలని పవన్ ట్వీట్ చేశాడు. వెంటనే.. చెన్నై నగర పాలక సంస్థ స్పందించింది. మత్యకారులకు తగిన సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చింది. ఏకంగా త‌మిళ నాడు ముఖ్య‌మంత్రి సైతం ఈ విష‌యంపై స్పందించారు. సంబంధింత అధికారుల‌తో తాను మాట్లాడ‌తాన‌ని, స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు. దాంతో పవన్ అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. చేతిలో అధికారం లేకపోయినా, రాష్ట్రాలు దాటి మరి సేవ చేయగలుగుతున్నాడని పవన్ కి కితాబులు అందుతున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS