ఆ సీన్స్‌పై ఎక్స్‌ట్రా కేర్‌ తీసుకుంటున్న 'సాహో'!

By iQlikMovies - July 15, 2019 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

యాక్షన్‌ ప్యాక్‌డ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న 'సాహో' విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ, 'సాహో' టీమ్‌ని కలవరపెడుతోన్న అంశం గ్రాఫిక్సే. ఇంత కాదు, అంత.. అంటూ బోలెడన్ని గొప్పలు చెప్పేశారు 'సాహో' సినిమా గురించి. దాంతో సినిమాపై భారీగా అంచనాలు క్రియేట్‌ అయిపోయాయి. ముఖ్యంగా 'సాహో'లో యాక్షన్‌ సీన్స్‌ కోసం పెట్టిన బడ్జెట్టే ఎక్కువ టెన్షన్‌ పెట్టేస్తోందట.

 

దుబాయ్‌లో యాక్షన్‌ సీన్ల కోసం కొన్ని కోట్ల రూపాయలు మంచినీళ్లలా ఖర్చు పెట్టేశారు. ఆ క్వాలిటీని తెరపై చూపించడంలో 'సాహో' టీమ్‌ ఎంత మేర సక్సెస్‌ అయ్యిందో తెలియాలంటే సినిమా విడుదలైతే కానీ, తెలీదు. తీరా విడుదలయ్యాక ఫ్యాన్స్‌ని సేటిస్‌ఫై చేయలేకపోతే, ఆ ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సో ఆ ప్రోబ్లమ్‌ రాకుండా ఉండాలనే 'సాహో' టీమ్‌ మరింత కష్టపడుతోందట. నిర్మాణంలో క్వాలిటీని చూపించేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోందట. ప్రస్తుతం గ్రాఫిక్స్‌ వర్క్‌లో బిజీగా ఉన్న 'సాహో' టెక్నికల్‌ యూనిట్‌పై ప్రెజర్‌ ఎక్కువవుతోందట. ఖర్చు పెట్టిన ఖర్చు, స్క్రీన్‌పై స్పష్టంగా కనిపించాలనే తపన వారిలో ఉందనీ, ఆ దిశగా పనులు జరుగుతున్నాయనీ, క్లారిటీతో పాటు వీలైనంత వేగంగా పని పూర్తి చేయాలంటూ టెక్నికల్‌ టీమ్‌ని అలర్ట్‌ చేస్తోందట నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌.

 

బాలీవుడ్‌ నటీనటులతో, భారీ బడ్జెట్‌తో, హాలీవుడ్‌ టెక్నికల్‌ టీమ్‌తో భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న 'సాహో' ఆగస్ట్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన 'ఆగడిక సయ్యా సైకో' సాంగ్‌ మొదట్లో నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నా, తర్వాత మెల్లగా ఊపందుకుంది. ఇక రాబోయే సాంగ్స్‌ ఎలా ఉండబోతున్నాయో, ఎలాంటి అంచనాల్ని క్రియేట్‌ చేయబోతున్నాయో తెలియాలంటే, ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS